Om Bheem Bush | ఓం భీష్ బుష్ ట్రయిలర్ లాంచ్

Om Bheem Bush - తెలుగుతెరపైకి మరో కామెడీ సినిమా రాబోతోంది. తాజాగా ఓం భీష్ బుష్ ట్రయిలర్ రిలీజైంది.

Advertisement
Update: 2024-03-16 07:25 GMT

హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా... 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఫన్ ఎంటర్‌టైనర్ 'ఓం భీమ్ బుష్'. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తోంది. ఇప్పటికే టీజర్ పెద్ద హిట్టయింది. తాజాగా సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ను లాంచ్ చేశారు.

ముగ్గురు యువకులు గ్రామంలోకి వచ్చాక, బ్యాంగ్ బ్రోస్ అనే కంపెనీ పెట్టడంతో ట్రైలర్ ప్రారంభమౌతుంది. ఈ ముగ్గురు వివిధ సమస్యలకు పరిష్కారంగా ట్యాబ్లెట్లతో పౌడర్ తయారు చేసి గ్రామస్తులకు అమ్ముతుంటారు. వారి వ్యాపారం పుంజుకున్నప్పుడు, అఘోరాల సమూహం గ్రామంలోకి ప్రవేశించి, రహస్యమైన సంపంగి మహల్‌లో నిధిని కనుగొనమని సవాలు విసురుతుంది.

మిగిలిన కథ ఆ నిధిని కనుగొనడానికి బ్యాంగ్ బ్రోస్ చేసిన ప్రయత్నాలతో సాగుతుంది. యువతను ఆకట్టుకునే అంశాలతో పాటు.. సినిమాలో ట్రెజర్ హంట్, హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి.

శ్రీవిష్ణు తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇతడితో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ స్పాంటేనియస్ డైలాగ్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణనిచ్చాయి. ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ హీరోయిన్లుగా కనిపించగా, బ్యాంగ్ బ్రోస్ పాటలో ప్రియా వడ్లమాని అలరించింది. ఓం భీమ్ బుష్ సినిమాను మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.

Full View

Tags:    
Advertisement

Similar News