VeeraSimha Reddy: స్పెషల్ సాంగ్ రిలీజ్

VeeraSimha Reddy: వీరసింహారెడ్డి సినిమా నుంచి స్పెషల్ సాంగ్ వచ్చేసింది. మా బావ మనోభావాల్ అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను తమన్ కంపోజ్ చేశాడు.

Advertisement
Update: 2022-12-24 15:35 GMT

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వీరసింహారెడ్డి' జనవరి 12న సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే 'వీరసింహారెడ్డి' ఆల్బమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ జై బాలయ్య, సెకండ్ సింగిల్ సుగుణ సుందరి ఇప్పటికే క్లిక్ అయ్యాయి.

ఇప్పుడు 'ది సెన్సేషనల్ స్పెషల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ 'మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి' పాటతో వచ్చారు మేకర్స్. ఇలాంటి పాటలను మంచి అనుభవం కోసం పెద్ద స్క్రీన్ పై చూడాలి. అందుకే పాటను సంధ్య 35 ఎంఎంలో గ్రాండ్ గా లాంచ్ చేశారు. భారీగా హాజరైన అభిమానులతోనే పాటని గ్రాండ్ గా విడుదల చేయించింది చిత్ర యూనిట్.

తమన్ తన ట్రేడ్ మార్క్ బీట్ తో పాటని లైవ్లీ గా స్కోర్ చేశాడు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కంపోజిషన్ ఎక్స్ ట్రార్డినరీ గా ఉంది. పాటను విజువల్ గా చూసినప్పుడు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

సాహితీ చాగంటి, యామిని, రేణు కుమార్ లు అద్భుతంగా అలపించారు. ఇక బాలకృష్ణ, చంద్రిక రవి తమ సూపర్ ఎనర్జిటిక్ డ్యాన్స్ తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. ముఖ్యంగా బాలకృష్ణ మాస్ డ్యాన్స్ మూవ్స్ తో మెస్మరైజ్ చేశారు. 


Full View


Tags:    
Advertisement

Similar News