Sekhar Kammula | సేమ్ బ్యానర్ లో కమ్ముల మూడో సినిమా

Sekhar Kammula - ఒకే బ్యానర్ లో వరుసగా సినిమాలు చేస్తున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇప్పటికే 2 సినిమాలయ్యాయి, ఇప్పుడు మూడో సినిమా కూడా రాబోతోంది.

Advertisement
Update: 2024-01-31 17:26 GMT

శేఖర్ కమ్ముల

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అద్భుతమైన చిత్రాలను రూపొందించడంలో మంచి పేరు తెచ్చుకున్న సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రస్తుతం ధనుష్, నాగార్జునతో మల్టీ స్టారర్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఏషియాన్ గ్రూప్ యూనిట్) బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ప్రొడక్షన్ హౌస్ తమ కొత్త చిత్రాన్ని ప్రకటించింది. ఈ సినిమాకు కూడా శేఖర్ కమ్ములనే దర్శకుడిగా తీసుకున్నారు. ఇంతకుముందు ఇదే బ్యానర్ పై నాగ చైతన్య, సాయి పల్లవితో క్లాసిక్ 'లవ్ స్టోరీ' సినిమా తీశాడు కమ్ముల. ప్రస్తుతం నాగ్-ధనుష్ హీరోలుగా సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా కూడా ఇదే బ్యానర్ పై చేయబోతున్నాడు.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తాయి. ఈ కొత్త చిత్రం లార్జర్ దేన్ లైఫ్ స్టోరీతో వస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే హీరో ఎవరనే విషయాన్ని వెల్లడిస్తారు.

ప్రస్తుతం ధనుష్ సినిమా పనిలో బిజీగా ఉన్నాడు కమ్ముల. రీసెంట్ గా ఈ సినిమా కోసం అలిపిరిలో కొన్ని సీన్లు తీశారు. ట్రాఫిక్ ఏరియాలో షూటింగ్ కోసం పర్మిషన్ ఇవ్వడం వివాదాస్పదమైంది.

Tags:    
Advertisement

Similar News