RRR2: పార్ట్-2 కన్ ఫర్మ్ చేసిన రాజమౌళి

రాంచరణ్, తారక్ హీరోలుగా నటించిన సినిమా RRR. ఇప్పుడీ సినిమా కు సీక్వెల్ రాబోతోంది. స్వయంగా రాజమౌళి ప్రకటించాడు

Advertisement
Update: 2022-11-14 10:16 GMT

'RRR' bags Best International Feature at Sunset Circle Awards

ఆర్ఆర్ఆర్ సినిమా రన్ తెలుగు రాష్ట్రాల్లో ముగిసింది. కానీ ఈ సినిమా ప్రపంచంలో ఏదో ఒక మూల నడుస్తూనే ఉంది. ప్రస్తుతం జపాన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శితమౌతోంది. ఆ తర్వాత కాన్స్ చిత్రోత్సవం, ఆస్కార్ అవార్డుల వేడుకల్లో కూడా ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఓవైపు ఆర్ఆర్ఆర్ హవా ఇలా కొనసాగుతుండగా, మరోవైపు ఆర్ఆర్ఆర్ కు సీక్వెల్ ప్రకటించాడు దర్శకుడు రాజమౌళి. 


'ఆర్ఆర్ఆర్' సీక్వెల్‌పై ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి పెదవి విప్పాడు. సీక్వెల్‌ని తీసే ఆలోచనలో ఉన్నామని వెల్లడించాడు. తన తండ్రి విజయేంద్రప్రసాద్ కథని రాసే పనిలో ఉన్నారని ప్రకటించాడు రాజమౌళి. అయితే అది ఏ దశలో ఉంది, ఎప్పుడు పట్టాలపైకి వస్తుందనేది మాత్రం జక్కన్న చెప్పలేదు.


ప్రస్తుతం జక్కన్న మహేశ్ బాబు సినిమాపై వర్క్ చేస్తున్నాడు. బహుశా ఈ సినిమా అయిన తర్వాత ఆర్ఆర్ఆర్-2 సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. దీనిపై ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఈ మూవీ పట్టాలెక్కడానికి చాలా టైమ్ పట్టేలా ఉంది. ఎందుకంటే, చరణ్, తారక్ ఇద్దరూ బిజీ అయ్యారు.

Tags:    
Advertisement

Similar News