Ustad Bhagat Singh | పవన్ సినిమా చేతులు మారిందా?

Ustad Bhagat Singh | పవన్ కల్యాణ్ సినిమా చేతులు మారబోతోందా? పీపుల్ మీడియా బ్యానర్ పై ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతోందా?

Advertisement
Update: 2023-07-18 04:18 GMT

పవన్, హరీశ్ శంకర్ సినిమాపై కొత్త గాసిప్ ఇది. ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా చక్కర్లు కొడుతున్న పుకారు ఇది. వాస్తవానికి మైత్రీ మూవీస్ నిర్మించాలని భావించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మరో ప్రొడక్షన్ హౌస్‌కి బదిలీ అయిందనేది ఈ పుకారు.

మైత్రీ చాలా కాలం కిందటే, పవన్ కల్యాణ్ కు ఈ సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చింది. గత ఎన్నికల టైమ్ లోనే తన అఫిడవిట్ లో కూడా ఈ మొత్తాన్ని చూపించారు పవన్. ఆ తర్వాత సినిమా సెట్స్ పైకి వచ్చిన తర్వాత మరికొంత ఎమౌంట్ ఇచ్చారు. వాటితో పాటు, ప్రొడక్షన్ కాస్ట్ కూడా కలిపితే లెక్క 60 కోట్లు దాటిందని తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పవన్ ఈ సినిమాకు ఎప్పుడు వర్క్ చేస్తాడనే దానిపై క్లారిటీ లేదు. ఆయన సినిమాల కంటే పాలిటిక్స్ పైనే ఎక్కువ దృష్టిపెట్టారు. ఈ నేప‌థ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత‌లు ప‌వ‌న్‌తో సినిమా బ‌డ్జెట్, ఇత‌ర వివ‌రాల‌పై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.

చర్చలు కొలిక్కి వస్తే.. ఇకపై ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా, మైత్రీ నుంచి పీపుల్స్ మీడియా బ్యానర్ కు బదిలీ అయ్యే అవకాశం ఉంది.

గతంలో డీవీవీ దానయ్య-ప్రభాస్-మారుతి సినిమాను పీపుల్స్ మీడియా టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ కల్యాణ్ ప్రాజెక్టును కూడా ఇదే విధంగా గంపగుత్తగా పీపుల్ మీడియా దక్కించుకునే అవకాశం ఉంది. బ్రో సినిమాతో పవన్ కల్యాణ్ కు, పీపుల్ మీడియా దగ్గరైన సంగతి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News