People Media | పీపుల్ మీడియా చేతికి మరో సినిమా

People Media - ఇప్పటికే గోపీచంద్ సినిమాను దక్కించుకుంది పీపుల్ మీడియా. ఇప్పుడు మరో చిన్న సినిమా హక్కులు కూడా దక్కించుకుంది.

Advertisement
Update: 2024-04-06 16:12 GMT

ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వరుస చిత్రాలతో సందడి చేస్తోంది. మంచి చిత్రాలను అందించే క్రమంలో, ఇతర నిర్మాతలతో కలిసి సినిమా హక్కులు దక్కించుకుంటోంది. ఈ క్రమంలో ‘నరుడి బ్రతుకు నటన’ అనే సినిమాలో నిర్మాతగా చేరింది పీపుల్ మీడియా. ఈ మూవీ షూటింగ్ అంతా కూడా కేరళలో జరిగింది. ఇక కేరళ ప్రకృతి అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

నరుడి బ్రతుకు నటన సినిమాలో కేరళ అందాలే హైలెట్ కానున్నాయి. శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్యా అనిల్ కుమార్, వైవా రాఘవ వంటి వారు ప్రముఖ పాత్రల్లో నటించిన ఈ మూవీని రిషికేశ్వర్ యోగి తెరకెక్కిస్తున్నారు.

సుకుమార్ బొరెడ్డి, డా. సింధు రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో మరో నిర్మాతగా చేరారు టీజీ విశ్వప్రసాద్. విడుదలకు ముందే 60కి పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి సన్నాహాలు చేస్తున్నారు.

నరుడి బ్రతుకు నటన గ్లింప్స్ చూస్తుంటే కేరళను అలా చుట్టి వచ్చినట్టుగా, మన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నట్టుగా, ఓ జీవితాన్ని చూసినట్టుగా అనిపిస్తోంది. 




Tags:    
Advertisement

Similar News