Pawan Kalyan: పవన్ సినిమా మరో గాడ్ ఫాదర్ అవుతుందా?

Pawan Kalyan: తేరి రీమేక్ పై చాలా చర్చ నడుస్తోంది. ఈ సినిమా చేయొద్దని పవన్ ఫ్యాన్స్ నానా హంగామా చేస్తున్నారు. మరోవైపు ఈ రీమేక్ ప్రాజెక్టు చేతులు మారుతూ వస్తోంది.

Advertisement
Update: 2022-12-09 06:30 GMT

పవన్ కల్యాణ్

కొన్నాళ్ల కిందటి సంగతి. లూసిఫర్ సినిమాను రీమేక్ చేయాలనుకున్నప్పుడు చిరంజీవి అనుసరించిన విధానం చాలా విమర్శలకు తావిచ్చింది. ముందుగా ఈ ప్రాజెక్టును పూరి జగన్నధ్ తో చేయాలనుకున్నారు చిరంజీవి. ఆ తర్వాత దర్శకుడు సుజీత్ తెరపైకొచ్చాడు. ఆ తర్వాత వినాయక్ లాంటి మరో ఇద్దరు దర్శకుల పేర్లు కూడా తెరపైకొచ్చాయి. ఫైనల్ గా ఆ అవకాశం కోలీవుడ్ దర్శకుడు మోహన్ రాజాకు దక్కింది. గాడ్ ఫాదర్ పేరుతో సినిమా తెరకెక్కింది.

ఇప్పుడు పవన్ కల్యాణ్ చేయబోయే ఓ సినిమా కూడా ఇదే విధంగా చేతులు మారుతోంది. అదే తేరి రీమేక్. మైత్రీ మూవీ మేకర్స్ దగ్గర ఈ కథ ఉంది. ముందుగా ఈ రీమేక్ ను సంతోష్ శ్రీనివాస్ తో చేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత అతడి స్థానంలో హరీశ్ శంకర్ వచ్చాడు. ఇప్పుడీ కథ సుజీత్ చుట్టూ తిరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి.

మరోవైపు అసలు తేరి రీమేక్ మాకొద్దంటూ పవన్ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. స్ట్రయిట్ సినిమా చేయాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకోవైపు ఇలా తేరి రీమేక్ చేతులు మారుతూనే ఉంది. దీంతో అందర్లో గందరగోళం కనిపిస్తోంది.

అటు యూనిట్ మాత్రం పవన్ తో చేస్తున్నది స్ట్రయిట్ సినిమానా లేక రీమేకా అనే విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. అయితే ఒకటి మాత్రం స్పష్టమైంది. పవన్ కల్యాణ్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీశ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ నెలలోనే పూజా కార్యక్రమాలు ఉంటాయి.

Tags:    
Advertisement

Similar News