Pavitra Naresh: పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పవిత్ర

Pavitra Naresh: తనకు, నరేష్ కు లింక్ పెడుతో ఓ సెక్షన్ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై పవిత్ర లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసుల్ని ఆశ్రయించారు.

Advertisement
Update: 2022-11-26 16:54 GMT

సీనియర్ నటి పవిత్ర లోకేష్, పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆమె ఆశ్రయించారు. తనపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తున్న కొన్ని సోషల్ మీడియా ఎకౌంట్లు, యూట్యూబ్ ఛానెళ్ల లింగ్స్ పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. ఇద్దరూ చాన్నాళ్లుగా చాలా క్లోజ్ గా ఉంటున్నారు. దీనిపై నరేష్ మూడో భార్య అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో నరేష్-పవిత్ర సంబంధంపై సోషల్ మీడియాలో పలు పోస్టులు దర్శనమిస్తున్నాయి.

నరేష్-పవిత్రపై ఓ సెక్షన్ మీడియా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తోంది. అక్కడితో ఆగకుండా వీళ్ల ఫొటోల్ని మార్ఫింగ్ చేసి మరీ కథనాలు ప్రసారం చేస్తోంది. దీనిపై పవిత్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నరేష్ తో లింక్ పెడుతూ, తనపై అభ్యంతరకరంగా వస్తున్న పోస్టుల్ని వెంటనే తొలిగించాలని కోరుతూ, ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు కొన్ని సోషల్ మీడియా ఎకౌంట్లు, మార్ఫింగ్ ఫొటోలు, యూట్యూబ్ లింక్స్ ను సాక్ష్యాలుగా ఆమె పోలీసులకు సమర్పించారు. పవిత్ర ఫిర్యాదుపై తక్షణం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నరేష్-పవిత్రపై ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యానాలు ఉన్నా తొలిగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Tags:    
Advertisement

Similar News