Om Bheem Bush | శ్రీవిష్ణు సినిమా కథ ఇదే

Om Bheem Bush - శ్రీవిష్ణు తాజా చిత్రం ఓం భీమ్ బుష్. ఈ సినిమా స్టోరీలైన్ బయటపెట్టాడు దర్శకుడు.

Advertisement
Update: 2024-03-12 17:28 GMT

హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా నటించిన సినిమా 'ఓం భీమ్ బుష్'. హుషారు సినిమాతో సూపర్ హిట్ కొట్టిన శ్రీ హర్ష కొనుగంటి ఈ సినిమాకు దర్శకుడు. ఇది కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్.

వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. 'ఓం భీమ్ బుష్' మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నాడు.

"ఒకప్పుడు బ్యాంకులు లేనప్పుడు మన దగ్గర ఉన్న డబ్బు, బంగారం ఒక బిందెలో పెట్టి భూమిలో దాచేవారు. ఈ కథలో యూనిర్సిటీలో చదువుకున్న ముగ్గురు ఓ గ్రామంలో అలాంటి గుప్తనిధుల కోసం చేసిన అన్వేషణ ఎలా జరిగిందనేది చాలా క్రేజీగా చూపించడం జరిగింది. 'ఓం భీమ్ బుష్' అనేది ఓ మ్యాజికల్ ఫ్రేజ్. చిన్న పిల్లలు ఆడుకున్నప్పుడు కూడా సరదాగా ఆ మాట వాడుతుంటారు. ఈ కథలో కూడా చాలా మ్యాజిక్ ఉంది. పారానార్మల్ యాక్టివిటీస్, ఆత్మలు, లంకె బిందెలు ఇలాంటి మిస్టీరియస్ ఎలిమెంట్స్ ఉంటాయి."

ఇలా తన సినిమా జానర్, స్టోరీలైన్ వెల్లడించాడు శ్రీహర్ష. రీసెంట్ గా సామజవరగమన సినిమాతో హిట్ కొట్టాడు శ్రీవిష్ణు. దానికి పదింతలు కామెడీ తన సినిమాలో ఉంటుందని చెబుతున్నాడు శ్రీహర్ష.

Tags:    
Advertisement

Similar News