NTR - విహారయాత్ర పూర్తిచేసిన తారక్, ఇకపై దేవర

NTR foreign trip - యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫారిన్ ట్రిప్ పూర్తి చేశాడు. కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లిన ఈ హీరో, హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు.

Advertisement
Update: 2023-06-05 11:10 GMT

ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీ ప్రణతి, వారి ఇద్దరు కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఇటీవల సెలవు తీసుకున్నారు. గత వారం, కుటుంబం మొత్తం దుబాయ్ వెళ్ళింది. సమ్మర్ లో జాలీగా గడిపింది. ఇప్పుడీ కుటుంబం మొత్తం హైదరాబాద్‌ తిరిగొచ్చింది.

ఇది ఒక చిన్న వెకేషన్ మాత్రమే. సమ్మర్‌లో తెలుగు హీరోలు చాలా మంది విదేశాలకు వెళ్తుంటారు. తారక్ కూడా అలానే వెళ్లాడు. వారం రోజుల్లో తిరిగొచ్చాడు.

ఎన్టీఆర్ రాకతో, అతడి కొత్త సినిమాపై మళ్లీ ఫోకస్ పడింది. కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను మరికొన్ని రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నారు. హైదరాబాద్ లోనే ఈ షెడ్యూల్ ఉంటుంది.

ఆర్ఆర్ఆర్ సక్సెక్ తో అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యాడు ఎన్టీఆర్. ఆ సినిమాలో పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో, ఎన్టీఆర్ మేనియా పెరిగింది. ఆ క్రేజ్ కు ఏమాత్రం తీసిపోని విధంగా దేవర సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల.

ఈ సినిమాతో జాన్వికపూర్ టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమౌతోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రానుంది దేవర.

Tags:    
Advertisement

Similar News