Mythri Movie Makers - మల్లూవుడ్ లోకి 'మైత్రీ'

Mythri Movie Makers - తెలుగులో భారీ చిత్రాల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న మైత్రీ మూవీ మేకర్స్, ఇప్పుడు మల్లూవుడ్ లోకి ఎంటరైంది.

Advertisement
Update: 2023-07-13 04:15 GMT

స్టార్ హీరోలతో అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించిన టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మలయాళంలో అడుగుపెడుతోంది. మిన్నల్ మురళి, తల్లుమల, 2018 చిత్రాలతో వరుస విజయాలు సాధించిన మలయాళ స్టార్ టోవినో థామస్‌తో "నడికర్ తిలకం" అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనుంది.

సంచలన విజయం సాధించిన డ్రైవింగ్ లైసెన్స్‌ని రూపొందించిన లాల్ జూనియర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ తమ మొదటి మలయాళ చిత్రాన్ని గాడ్‌ స్పీడ్‌ బ్యానర్ తో కలిసి నిర్మించనుంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్, అల్లన్ ఆంటోని, అనూప్ వేణుగోపాల్ ఈ చిత్రానికి నిర్మాతలు.

"'నడికర్ తిలకం" ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా తాజాగా కొచ్చిలో ప్రారంభమైంది. ఈ సినిమాని 120 రోజుల పాటు వివిధ లొకేషన్లలో చిత్రీకరించనున్నారు. టోవినో థామస్ ఈ చిత్రంలో అనేక సవాళ్ళతో కూడిన సూపర్ స్టార్ డేవిడ్ పడిక్కల్ పాత్రను పోషిస్తున్నారు. భావన హీరోయిన్.

తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన షైనా టామ్ చాకో కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ అడుగుపెడ్డడంతో, మలయాళం సినిమాకు భారీతనం వచ్చినట్టయింది.

Tags:    
Advertisement

Similar News