Murali Mohan | గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్న మురళీ మోహన్

Murali Mohan - మురళీ మోహన్ ఇండస్ట్రీకొచ్చి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు.

Advertisement
Update: 2024-02-11 14:35 GMT

నటుడు, నిర్మాత మురళీమోహన్, 50 ఏళ్ల సినీ కెరీర్ ను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కృష్ణంరాజు సతీమణి, గురవారెడ్డి, నర్సాపురం పార్లమెంట్‌ సభ్యులు రఘురామకృష్ణంరాజు, సుజనా చౌదరి, కోటా శ్రీనివాసరావు, కీరవాణి, రాజమౌళి, అశ్వనీదత్‌ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా 50 మురళిలతో కూడిన దండతో మురళీమోహన్‌ను సత్కరించారు. 50 ఏళ్ల క్రితం తనకు తొలి అవకాశం ఇచ్చిన అట్లూరి పూర్ణచంద్రరావుకి మురళీమోహన్‌ ఒక కారును బహుమతిగా అందజేశారు.

మురళీమోహన్‌ గారు మాట్లాడుతూ... "నేను ఇవాళ ఈ స్థాయిలో మీ ముందు ఉన్నానంటే అట్లూరి పూర్ణచంద్రరావు గారు పెట్టిన భిక్ష. 1973లో ఆయన నాకు హీరోగా అవకాశం ఇచ్చారు. ఇండస్ట్రీలో నన్ను నిలబెట్టింది దాసరి గారు. వీరిద్దరినీ నా జీవితంలో మర్చిపోలేను. నాతో పనిచేసిన హీరోయిన్లు ఎంతో కలివిడిగా ఉండేవారు. వారితో ఫ్యామిలీ మెంబర్స్‌గా ఉంటాను. నా తొలి సినిమా నుంచి ఇప్పటి వరకూ నాకు కొల్లి రాముగారు మేకప్‌ మ్యాన్‌గానే ఉండిపోయారు. ఈ కార్యక్రమం ఇంత బాగా నిర్వహించిన అందరికీ నా కృతజ్ఞతలు" అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభ, జయచిత్ర, కవిత, అట్లూరి పూర్ణ చంద్రరావుతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News