Miss Shetty Mr Polishetty | సెన్సార్ పూర్తిచేసుకున్న అనుష్క సినిమా

Miss Shetty Mr Polishetty - నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకుంది.

Advertisement
Update: 2023-08-31 14:31 GMT

పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు.

సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తవ్వడంతో ఈ సినిమా రిలీజ్ కు అధికారికంగా కౌంట్ డౌన్ మొదలైంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ఇక తెరపైకి రావడమే మిగిలింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ఈ సినిమా రన్ టైం 151 నిమిషాలుంది.

రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ కథతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌ నిర్మించారు. మ‌హేష్ బాబు దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా సెప్టెంబర్ 7న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే హీరో నవీన్, ఈ సినిమా ప్రచారాన్ని ప్రారంభించాడు. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా పర్యటనలు చేస్తున్నాడు. ఇప్పటికే గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు కవర్ చేశాడు. త్వరలోనే మరిన్ని ప్రాంతాలు కవర్ చేయబోతున్నాడు. అనుష్క ఈ సినిమాకు ప్రచారం చేస్తుందా చేయదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News