Mangalavaaram | మళ్లీ మెరిసిన మంగళవారం

Mangalavaaram - మంగళవారం మరోసారి మెరిసింది. జైపూర్ ఫిలింఫెస్టివల్ లో అవార్డుల పంట పండించింది.

Advertisement
Update: 2024-01-29 17:04 GMT

ఆర్ఎక్స్ 100, మహా సముద్రం చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా 'మంగళవారం'. థ్రిల్లింగ్ రెస్పాన్స్ తో థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రం ఇటీవల డిస్నీ హాట్ స్టార్ లోకి కూడా వచ్చింది. ప్రపంచవ్యాప్త ప్రేక్షకులని అలరిస్తోంది.

ఇప్పుడీ సినిమా మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది. జైపూర్ ఫిలిం ఫెస్టివల్ లో 4 అవార్డులని గెలుచుకుంది మంగళవారం మూవీ. ఉత్తమ నటిగా పాయల్ రాజ్ పుత్ అవార్డు గెలుచుకోగా.. ఉత్తమ సౌండ్ డిజైన్, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగాల్లో మంగళవారం సినిమాకు అవార్డులొచ్చాయి.

తమ సినిమాకు అవార్డులు రావడం పట్ల చిత్ర నిర్మాతలు ముద్ర మీడియా వర్క్స్ స్వాతి రెడ్డి, సురేష్ వర్మ సంతోషం వ్యక్తం చేశారు. కథ - కథనాలతో పాటు.. సాంకేతిక అంశాల పరంగా కూడా ఈ సినిమా మంచి ప్రశంసలు దక్కించుకుంది. జైపూర్ ఫిలిం ఫెస్టివల్ అవార్డుల కమిటీ కూడా ఇదే విషయాన్ని గుర్తించింది. 




Tags:    
Advertisement

Similar News