Manchu Manoj | భార్యతో కలిసి కొత్త వ్యాపారం ప్రారంభించిన మనోజ్

Manchu Manoj - తన భార్య మౌనికతో కలిసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు మంచు మనోజ్. చిన్న పిల్లల బొమ్మల బ్రాండింగ్ మొదలుపెట్టాడు.

Advertisement
Update: 2023-12-27 16:43 GMT

మంచు మనోజ్, భూమా మౌనిక కలిసి నమస్తే వరల్డ్ బ్రాండ్ తో చిన్నారుల బొమ్మలు కార్టూన్, యానిమేషన్ రూపంలో తీసుకువచ్చేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్ లో నమస్తే వరల్డ్ బ్రాండ్ టాయ్స్ స్టోర్ ను ప్రారంభించారు. చిన్నారుల కోసం బొమ్మలు తయారు చేస్తున్నప్పటికీ.. వీటిలో భారతీయ హస్తకళ నైపుణ్యం, మహిళా సాధికారత, స్కిల్ డెవలప్ మెంట్ ను పొందుపరుస్తున్నారు.

ఈ సందర్భంగా సీఈవో మంచు మనోజ్ మాట్లాడుతూ.. మనం ఇప్పటి వరకు విదేశాలకు చెందిన కల్చర్ ను అలవాటు చేసుకున్నామని.. ఇప్పుడు ఇండియన్ కల్చర్ ను ప్రమోట్ చేసేందుకు తనవంతుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మన దేశంలో గొప్ప సంస్కృతి ఉందని.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కథ ఉందన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు, కళలను వెలికి తీసేందుకు ఇది చక్కటి వేదికగా నిలుస్తుందన్నాడు. తనకు చిన్నప్పటి నుండి బొమ్మలు వేయడం అలవాటైందని.. ఇప్పుడిలా నమస్తే వరల్డ్ బ్రాండ్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నాడు.

నమస్తే బ్రాండ్ టాయ్స్ దేశంలోని అన్ని జియో ఔట్ లెట్స్ లో, రిలయన్స్ తో పాటు అన్ని షోరూంలలో అందుబాటులో ఉంటాయి. ఈ సందర్భంగా మరో ఆఫర్ ప్రకటించాడు మనోజ్. చిన్నారులు పేపర్ పై బొమ్మలు గీసి తమకు పంపిస్తే.. వాటిని బొమ్మలు, యానిమేషన్, గేమింగ్ లో ఉంచి వాటికి ప్రాచుర్యం తీసుకువస్తామని ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News