Manchu Lakshmi | ఆదిపర్వం మలుపు తిప్పుతుందంటున్న మంచు లక్ష్మి

Manchu Lakshmi - ఆదిపర్వం అనే సినిమా చేస్తోంది మంచు లక్ష్మి. ఈ సినిమా తన కెరీర్ ను మలుపు తిప్పుతుందని భావిస్తోంది.

Advertisement
Update: 2024-02-04 15:50 GMT

అన్వికా ఆర్ట్స్ నిర్మాణంలో రూపుద్దిద్దుకుంటున్న చిత్రం "ఆదిపర్వం". మంచులక్ష్మి ప్రధాన పాత్రలో 5 భాషల్లో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి దర్శకుడు సంజీవ్ మేగోటి. ఈ చిత్రం 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామా. సినిమాలో గ్రాఫిక్స్ హైలెట్ గా నిలుస్తాయి.

"అమ్మోరు, అరుంధతి" చిత్రాల మాదిరిగా హై టెన్షన్ యాక్షన్ ఫిలింగా దక్షిణ భారతదేశంలోని అన్ని భాషలతో పాటు హిందీలో కూడా ఈ సినిమాను రెడీ చేస్తున్నారు. ఈ సినిమాలో "నాగలాపురం నాగమ్మ"గా మంచులక్ష్మి నటవిశ్వరూపం చూడవచ్చని అంటున్నాడు దర్శకుడు.

మంచులక్ష్మితో పాటు ఆదిత్య ఓం, ఎస్తర్, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని.. ఇలా చాలా మంది నటీనటులు నటిస్తున్నారు. ప్రస్తుతం గ్రాఫిక్ వర్క్స్ చివరి దశకు చేరుకున్నాయి. అవి పూర్తయిన వెంటనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.

నాగమ్మగా మంచులక్ష్మి ఈ సినిమాలో ఎంతో రిస్క్ చేసి 2 ఫైట్స్ చేసిందట. ఇక క్షేత్ర పాలకుడిగా ప్రత్యేక పాత్ర చేస్తున్న శివకంఠంనేని కూడా అద్భుతంగా నటించాడని అంటోంది యూనిట్. లాంగ్ గ్యాప్ తర్వాత మంచు లక్ష్మి నుంచి వస్తున్న సినిమా ఇదే.

Tags:    
Advertisement

Similar News