Guntur Kaaram | సోషల్ మీడియాను ఊపేస్తున్న గుంటూరు కారం

Guntur Kaaram: గుంటూరు కారం నుంచి తాజాగా ట్రయిలర్ రిలీజైంది. సోషల్ మీడియాను ఊపేస్తోంది.

Advertisement
Update: 2024-01-08 15:34 GMT

Guntur Kaaram Trailer Trending: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గుంటూరు కారం. గతంలో వీరిద్దరూ కలిసి 'అతడు', 'ఖలేజా' వంటి కల్ట్ క్లాసిక్‌లను అందించారు. మళ్లీ ఇన్నాళ్లకు 14 ఏళ్ల విరామం తర్వాత కలిసి సినిమా చేశారు. హారిక హాసిని క్రియేషన్స్ పై తెరకెక్కిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రయిలర్ రిలీజ్ చేశారు.

గుంటూరుకు చెందిన రమణగా మహేష్ బాబు ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. మహేష్ బాబు డైలాగ్స్, యాటిట్యూడ్, ఎనర్జీ అన్నీ వినోదాత్మకంగా, డిఫరెంట్ గా ఉన్నాయి. "చూడగానే మజా వస్తుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది, ఈల వేయాలి అనిపిస్తుంది!" అనే డైలాగ్.. ఈ ట్రయిలర్ కు సరిపోతుంది. ప్రస్తుతం ఈ ట్రయిలర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.

ఈ సినిమాలో... మహేష్-శ్రీలీల కాంబినేషన్ సీన్స్ చాలా బాగుంటాయనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది. బాబుతో ఆమె డ్యాన్సులు, కెమిస్ట్రీ కళ్లు చెదిరేలా ఉన్నాయి. యువ అందాల తార మీనాక్షి చౌదరికి కూడా ట్రయిలర్ లో చోటిచ్చారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జయరామ్ ఇతర ముఖ్య పాత్లు పోషించినట్టు ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. గుంటూరుకారం సినిమా, ఈ ట్రైలర్ ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది.

Full View

Tags:    
Advertisement

Similar News