Mahesh Babu | 2 భాగాలుగా మహేష్-రాజమౌళి సినిమా

Mahesh Babu and Rajamouli - మహేష్ బాబు, రాజమౌళి త్వరలోనే సినిమా చేయబోతున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతోంది.

Advertisement
Update: 2023-11-14 15:37 GMT

SS Rajamouli, Mahesh Babu: మహేష్ బాబు-రాజమౌళి సినిమాపై మరో గాసిప్

స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ అడ్వెంచరస్ థ్రిల్లర్ రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. రాజమౌళి, అతని రైటింగ్ టీమ్ దాదాపు స్క్రీన్ ప్లే పూర్తి చేశారు. ఈ గ్యాంగ్ లో అతడి తండ్రి విజయేంద్ర వర్మ కూడా ఉన్నారు. ఈ ప్రాజెక్టుకు కథ అందించింది ఆయనే.

త్వరలోనే రాజమౌళి-మహేష్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడీ ప్రాజెక్టు నుంచి క్రేజీ అప్ డేట్ బయటకొచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాను 2 పార్టులుగా చిత్రీకరిస్తారట. కథను రెండు భాగాలుగా విభజించాలని రాజమౌళి నిర్ణయం తీసుకున్నాడట.

ఇలా 2 భాగాలుగా సినిమాను చెప్పాలనే ట్రెండ్ స్టార్ట్ చేసిందే రాజమౌళి. అతడు తీసిన బాహుబలి సినిమా 2 భాగాలుగా వచ్చి అఖండ విజయం సాధించింది. అయితే ఆ తర్వాత చేసిన ఆర్ఆర్ఆర్ ను ఆయన విభజించలేదు. సింగిల్ సినిమాగానే తీశాడు. ఈసారి మాత్రం కథ పెద్దగా ఉండడంతో, 2 పార్టులు చేయాలని నిర్ణయించుకున్నాడట.

తాజా సమాచారం ప్రకారం, ఓ ఆంగ్ల నవల ఆధారంగా ఈ సినిమా రాబోతోందట. స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే పనులు అన్నీ ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే మహేష్ బాబుకు ఫైనల్ నెరేషన్ ఇవ్వలేదు.

రాజమౌళికి ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో అతడు ఆస్కార్ స్థాయికి కూడా వెళ్లాడు. దీంతో మహేష్ బాబు సినిమా కోసం ముందుగానే అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. ఓ భారీ హాలీవుడ్ స్టుడియోతో కలిసి పని చేయాలని అనుకుంటున్నారు. కేఎల్ నారాయణ ఈ సినిమాకు నిర్మాత.

Tags:    
Advertisement

Similar News