Kamal Hassan | 'నాయకుడు' మళ్లీ వస్తున్నాడు

Kamal Hassan - అరుదైన కాంబినేషన్ సెట్ అయింది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కలిసి సినిమా చేస్తున్నారు.

Advertisement
Update: 2023-10-28 16:30 GMT

కమల్ హాసన్, మణిరత్నం కలిసి సినిమా చేసి 3 దశాబ్దాలు దాటిపోయింది. మళ్లీ ఇన్నేళ్లకు ఇద్దరూ కలిశారు. 1987లో విడుదలైన కల్ట్ యాక్షన్ డ్రామా ‘నాయకుడు’ తర్వాత కమల్-మణిరత్నం కలిసి మరో సినిమా చేయబోతున్నారు. దాదాపు 36 సంవత్సరాల తర్వాత ఈ లెజెండ్స్ ఇద్దరూ కలవడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

తాజాగా ఈ సినిమా లాంఛ్ అయింది. లాంఛింగ్ కు కమల్, మణిరత్నం ఇద్దరూ వచ్చారు. కెరీర్ లో కమల్ హాసన్ కు ఇది 234వ చిత్రం. ప్రారంభోత్సవం సందర్భంగా విడుదల చేసిన ‘బిగిన్ ది బిగిన్’ అనే ప్రోమోలో కమల్ హాసన్, ప్రదీప్ శక్తి మధ్య నాయకుడు సినిమాలోని ఐకానిక్ సీక్వెన్స్ చూపించారు.

ఈ సినిమాకు కమల్ హాసన్, మణిరత్నం ఇద్దరూ నిర్మాతలు కూడా. కమల్ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మణిరత్నంకు చెందిన మద్రాస్ టాకీస్ బ్యానర్లపై ఈ మూవీ రాబోతోంది. ఉదయనిధి స్టాలిన్ కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

మణిరత్ సినిమాలకు రెగ్యులర్ గా మ్యూజిక్ ఇచ్చే ఏఆర్ రెహమాన్, ఈ సినిమాకు కూడా సంగీతం సమకూరుస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటిర్ గా వ్యవహరిస్తారు. మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

Tags:    
Advertisement

Similar News