Veerasimha Reddy: నా నమ్మకం నిజమైంది

Veerasimha Reddy: వీర సింహా రెడ్డి పై తనకున్న నమ్మకం నిజమైంది అంటున్నాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని.

Advertisement
Update: 2023-01-13 15:56 GMT

వీరసింహారెడ్డి విషయంలో తన నమ్మకం నిజమైందంటున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. సిస్టర్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని బలంగా నమ్మానని, అది ఈరోజు నిజమైందంటున్నాడు. బాలయ్య అభిమానులతో పాటు, ప్రేక్షకులందరికీ తన కథ నచ్చిందంటున్నాడు.


"కథని బలంగా నమ్మి చేసిన చిత్రమిది. బ్రదర్-సిస్టర్ ఎమోషన్ ని నిజాయితీగా బలంగా నమ్మి తీస్తే ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్ అవుతారనే నమ్మకం ఉండేది. మా నమ్మకం నిజమైంది. మేము ఊహించిన దాని కంటే ఎక్కువ అప్లాజ్ వచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకులు కంటతడి పెట్టుకొని ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే చాలా ఎమోషనల్ గా అనిపించింది. మేము అనుకున్న ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. సిస్టర్ పాత్ర కోసం వరలక్ష్మీ శరత్ కుమార్ ని అనుకున్నప్పుడు బాలకృష్ణ మరో ఆలోచన లేకుండా ఓకే అన్నారు. అప్పటికే ఆయన క్రాక్ చూశారు. వరలక్ష్మీ చేయగలదనే నమ్మకం ఉంది. యాంటి సిస్టర్ సెంటిమెంట్ ఉన్న ఆ పాత్రని వరలక్ష్మీ ఎక్స్ ట్రార్డినరీగా చేసింది."


ఇలా సిస్టర్ సెంటిమెంట్ కారణంగానే సినిమా పెద్ద హిట్టయిందని చెప్పుకొచ్చాడు గోపీచంద్ మలినేని. అయితే ప్రేక్షకుల రెస్పాన్స్ మాత్రం మరోలా ఉంది. సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ, అది ఆశించిన స్థాయిలో ఎమోషన్ ను అందించలేకపోయిందని విమర్శలు వస్తున్నాయి. 


బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్. బాలయ్య చెల్లెలిగా వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

Tags:    
Advertisement

Similar News