గరికపాటి వివాదం : చిరు ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచిన మంచు విష్ణు

ఇటీవల గరికపాటి నరసింహారావు చిరంజీవి పై చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేకెత్తించాయో అందరికీ తెలిసిందే

Advertisement
Update: 2022-10-16 07:50 GMT

Manchu Vishnu

ఇటీవల గరికపాటి నరసింహారావు చిరంజీవి పై చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేకెత్తించాయో అందరికీ తెలిసిందే. దీనికి చిరు ఫ్యాన్స్ ఓ రేంజ్ లో గరికపాటిపై ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేశారు. చిరంజీవికి అనుకూలంగా కొందరు నటీనటులు కూడా గరికపాటి వ్యాఖ్యలపై విమర్శలు చేశారు.

అయితే తాజాగా మంచు విష్ణు గరికపాటి- చిరంజీవి ఎపిసోడ్ పై చేసిన వ్యాఖ్యలు చిరంజీవి ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచాయి. సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ఫ్యామిలీ కి మోహన్ బాబు ఫ్యామిలీ కి మధ్య కొంత గ్యాప్ ఉందని మొదటి నుంచి కొంత ప్రచారం ఉంది. అయితే ఇటీవల కొంతకాలం చిరంజీవి- మోహన్ బాబు ఎంతో సఖ్యతతో మెలిగినట్లు కనిపించినా మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య మళ్లీ విభేదాలు తలెత్తాయన్న ప్రచారం ఉంది. మంచు విష్ణు కూడా ఇటీవల కాలంలో చిరంజీవిపై పరోక్షంగా విమర్శలు చేశాడు.

ఈ నేపథ్యంలో ఆయన చిరు గరికపాటి వ్యవహారంపై కామెంట్స్ చేశాడు. 'అలయ్ బలయ్' కార్యక్రమంలో ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు. గరికపాటి గారు ఏదో అనడం, అందుకు చిరంజీవి ఫ్యాన్స్ స్పందించడం జరిగింది. కానీ చిరంజీవి గారు ఒక లెజెండ్. ఆయనతో ఫోటో తీసుకోవడం అనేది అభిమానులకు ఒక సువర్ణ అవకాశం. చిరంజీవి దగ్గరికి ఎవరైనా పరిగెత్తుకు వెళ్లి ఫోటో తీసుకోవడం మామూలే.

అభిమానుల ఉత్సాహాన్ని ఆపలేం. చిరు వంటి పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు ఎవరైనా సరే ఎగ్జైట్మెంట్లో ఉంటారు' అని విష్ణు కామెంట్స్ చేశాడు. గరికపాటి ఎపిసోడ్ పై విష్ణు చేసిన కామెంట్స్ చిరంజీవి అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News