Dil Raju | అప్పుడు అరుంధతి, ఇప్పుడు మంగళవారం

Mangalavaaram Movie - మంగళవారం సినిమా కలెక్షన్లపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు దిల్ రాజు. ఈ సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు, సినిమా హిట్ అవుతుందని తనకు ముందే తెలుసంటున్నాడు.

Advertisement
Update: 2023-11-18 16:23 GMT

పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కింది మంగళవారం సినిమా. అజయ్ భూపతి దర్శకుడు. ఈ సినిమాను దిల్ రాజు నైజాంలో రిలీజ్ చేశాడు. సినిమాకు అన్ని ఏరియాస్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో తాజాగా సక్సెస్ మీట్ ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడాడు. తనకు గతంలో అరుంధతి చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో, ఇప్పుడు మంగళవారం చూసినప్పుడు కూడా సరిగ్గా అలాంటి ఫీలింగ్ కలిగిందని చెబుతున్నాడు.

"గతంలో అరుంధతి సినిమా చూశా. అప్పుడు ఏదైతే ఫీల్ కలిగిందో... మంగళవారం చూసినప్పుడు కాడా అలా అనిపించింది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక్కో పార్ట్ రివీల్ చేస్తూ వచ్చాడు దర్శకుడు.. ఈ రోజు ప్రేక్షకులు సినిమా బావుందని అనడానికి కారణం అదే. ఆ ట్విస్టులు బాగా పండాయి. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ దర్శకుడికి ఇవ్వాలి. కొత్తవాళ్లుతో, కొత్త నిర్మాతలతో సినిమా చేయడం అంత ఈజీ కాదు. కథ విన్నప్పుడు, సినిమా చూసినప్పుడు ఏం ఫీల్ అయ్యానో... అదే ఇప్పుడు ప్రేక్షకులు చెబుతున్నారు."

మంగళవారం సినిమాకు నైజాంలో శుక్రవారం ఉదయం 18 లక్షలు, మ్యాట్నీ 20 లక్షలు, శనివారం ఉదయం 15 లక్షలు, మ్యాట్నీ 25 లక్షల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. మౌత్ టాక్ ఉంటే ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారని చెప్పడానికి ఇదే సాక్ష్యం అంటున్నారు దిల్ రాజు. బలగం, బేబీ, సామజవరగమన తరహాలో ఇప్పుడీ 'మంగళవారం' కూడా మౌత్ టాక్ తో హిట్టయిందని అన్నారు. 

Tags:    
Advertisement

Similar News