Miss Shetty Mr Polishetty | బ్రాండ్ అంబాసిడర్ గా మారిన దిల్ రాజు

Miss Shetty Mr Polishetty - మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు దిల్ రాజు. ఆయన ఏమంటున్నాడంటే..?

Advertisement
Update: 2023-09-11 17:55 GMT

నిర్మాత, ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. అయితే కేవలం ఒక్క సినిమాకు మాత్రమే. తాజాగా థియేటర్లలోకి వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు ఆయన ప్రచారకర్తగా మారారు. ఎప్పుడు, ఎక్కడకి రమ్మన్నా, వచ్చి సినిమాకు ప్రచారం చేస్తానంటున్నాడు.

"తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తారని మరోసారి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తో ప్రూవ్ చేశారు. ఈ సినిమా జవాన్ తో పాటు రిలీజైనా స్టడీగా నిలదొక్కుకుంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా చూస్తున్నప్పుడు మంచి ఫీల్ కలిగింది. నవీన్ పోలిశెట్టి తన క్యారెక్టర్ లో నవ్విస్తూనే ఉన్నాడు. అలాగే అనుష్క యాక్టింగ్ తో ఎమోషనల్ చేస్తోంది. సినిమా ఫినిష్ అయ్యేప్పటికి ఒక మంచి సినిమా చూశాననిపించింది. వెంటనే యూవీ వంశీకి, నవీన్ కు ఫోన్ చేశాను. మీరు మంచి సినిమా చేశారు. మౌత్ టాక్ బాగుంది. దీన్ని ప్రజల దగ్గరకు మరింతగా తీసుకెళ్లాలి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టమని నేనే అడిగాను."

ఇలా సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు దిల్ రాజు. ఇంకా సినిమా చూడని వాళ్లుంటే చూడాలని, ఈ సినిమా ప్రచారం కోసం ఎక్కడికి రమ్మన్నా తను వచ్చేందుకు సిద్ధమని ప్రకటించాడు రాజు. ఓవర్సీస్ లో ఈ సినిమా ఆల్రెడీ మిలియన్ మార్క్ అందుకున్న సంగతి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News