Ilayaraja Biopic | ధనుష్ హీరోగా ఇళయరాజా బయోపిక్

Dhanush as Ilayaraja - ధనుష్ హీరోగా క్రేజీ బయోపిక్ రాబోతోంది. మ్యాస్ట్రో ఇళయరాజా జీవితాన్ని వెండితెరపైకి తీసుకొస్తున్నాడు ఈ హీరో.

Advertisement
Update: 2023-11-11 13:31 GMT

వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్నాడు ధనుష్. ఈ వెర్సటైల్ స్టార్ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టాడు. అదే మ్యాస్ట్రో ఇళయరాజా బయోపిక్. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సంగీత జ్ఞానిగా తనదైన ముద్ర వేసిన ఈయనపై సినిమా రానుండటం సంగీతాభిమానులతో పాటు ఇళయరాజా అభిమానులను, సినీ ప్రేక్షకులను ఆనందోత్సహాల్లో ముంచెత్తింది.

ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ సంస్థలు కలిసి రూపొందించనున్నాయి. ఈ నిర్మాణ సంస్థల కలయికలో తొలి చిత్రంగా రూపొందనున్న ఈ బయోపిక్ షూటింగ్ అక్టోబర్ 2024లో ప్రారంభమై 2025 మధ్యలో విడుదల కానుంది.

రాబోయే మూడేళ్లలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా అనేక మెగా-బడ్జెట్ చిత్రాలను కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ కలిసి సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. దీని కోసం వీళ్లు ఏకంగా 925 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించారు.

భారతదేశంతో పాటు అమెరికా, కెనడా, కరేబియన్ దీవులు, యూరప్‌లో కన్సల్టింగ్, టెక్నాలజీ, స్పోర్ట్స్, మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇలా ఎన్నో ఇండస్ట్రీల్లో వ్యాపారం చేస్తోంది మెర్క్యూరీ గ్రూప్. అయితే దీని దృష్టి ఎల్లప్పుడూ ప్రాంతీయ సినిమాలపైనే ఉంది. అనేక ప్రముఖ నిర్మాణ సంస్థలతో, గత దశాబ్దంలో కొన్ని అతిపెద్ద, అత్యుత్తమ చిత్రాలతో విస్తృతంగా పనిచేసిన గొప్ప అనుభవాన్ని కలిగి ఉంది. ఇప్పుడు నేరుగా సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టింది.

Tags:    
Advertisement

Similar News