Cameraman Gangatho Rambabu | గంగతో రాంబాబు.. మళ్లీ వస్తున్నాడు

Cameraman Gangatho Rambabu - పవన్ కల్యాణ్ హీరోగా నటించిన కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమా రీ-రిలీజ్ కు రెడీ అయింది.

Advertisement
Update: 2024-01-31 17:03 GMT

దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన "కెమెరామెన్ గంగతో రాంబాబు" చిత్రం ఓ సెక్షన్ ఆడియన్స్ ను అలరించింది. త్వరలో ఎలక్షన్స్ జరగబోతున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.


పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం 2012వ సంవత్సరం అక్టోబర్ లో 1600 పైగా స్క్రీన్స్ లో విడుదలై సంచలనం సృష్టించిన విషయం గుర్తుండే ఉంటుంది.


రాంబాబుగా పవన్ కళ్యాణ్, గంగ పాత్రలో తమన్నా కనిపిస్తారు. మెకానిక్ అయిన రాంబాబు అన్యాయాలను ఎదురించే దైర్యశాలిగా గంగను ఆకట్టుకుంటాడు. రాంబాబు మెకానిక్ గా కంటే జర్నలిస్టుగా అయితేనే బావుంటుందని భావించిన టీవీ చానల్ కెమెరామెన్ అయిన గంగ అతనిని జర్నలిస్టుగా చేర్పిస్తుంది. ఈ నేపథ్యంలో సొసైటీలో జరిగే అరాచకాలను వారు ఎలా ఎదుర్కొన్నారు అన్న కధాంశంతో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది.


మణిశర్మ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రీ-రిలీజ్ ట్రెండ్ లో భాగంగా ఇప్పడు ఈ సినిమాను ఫిబ్రవరి 7న మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు నిర్మాత నట్టి కుమార్ తెలిపారు.

Tags:    
Advertisement

Similar News