Mister X - మరో మల్టీస్టారర్ కు రంగం సిద్ధం

Arya and Gautham Karhik - ఆర్య, గౌతమ్ కార్తీక్ కలిసి మల్టీస్టారర్ చేయబోతున్నారు. ఈ సినిమాకు మిస్టర్-ఎక్స్ అనే పేరు పెట్టారు.

Advertisement
Update: 2023-05-02 16:14 GMT

మరో ఇద్దరు హీరోలు కలిశారు. మల్టీస్టారర్ చేయబోతున్నారు. వాళ్లే ఆర్య, గౌతమ్ కార్తీక్. వీళ్లిద్దరు ప్రధాన పాత్రల్లో ‘మిస్టర్ ఎక్స్’ అనే కొత్త ప్రాజెక్ట్‌ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది.

అయితే ఈ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. ఇందులో ఇద్దరు హీరోలు నటిస్తున్నప్పటికీ, అందులో ఒకరు విలన్ గా కనిపించబోతున్నారు. ఆర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్‌ కార్తీక్‌ విలన్‌గా నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి ‘ఎఫ్‌ఐఆర్’ సినిమా ఫేమ్ మను ఆనంద్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇది యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా రాబోతోంది. ఉగాండా, సెర్బియా దేశాల్లో ఈ సినిమా యాక్షన్ బ్లాక్స్ తీయబోతున్నారు.

సీనియర్ నటుడు కార్తీక్ నటవారసుడిగా కోలీవుడ్ లో అడుగుపెట్టాడు గౌతమ్ కార్తీక్. అయితే ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు. ఒక దశలో తండ్రికొడుకులిద్దరూ కలిసి సినిమా చేసినప్పటికీ సక్సెస్ రాలేదు. దీంతో మిస్టర్ ఎక్స్ సినిమాతో విలన్ గా మారాడు గౌతమ్ కార్తీక్.

మంజిమా మోహన్ ను పెళ్లాడిన తర్వాత గౌతమ్ కార్తీక్ అంగీకరించిన సినిమా ఇదే. ఈ చిత్రాన్ని తెలుగు తమిళ్, కన్నడ మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

Tags:    
Advertisement

Similar News