నేడు (29-12-2022) పెరిగిన బంగారం, వెండి ధరలు

నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.200 వరకూ పెరిగి రూ.50,150కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.230 వరకూ పెరిగి రూ.54,170కి చేరుకుంది.

Advertisement
Update: 2022-12-29 03:29 GMT

బంగారం ధరలు ఇటీవల కాలంలో కాస్త శాంతించినట్టు కనిపించినా తిరిగి పరుగు మొదలు పెట్టాయి. డిసెంబర్ 20 తర్వాత రెండు, మూడు రోజుల పాటు బంగారం ధరలో తగ్గుదల కనిపించినప్పటికీ ఎక్కువగా అయితే పెరగడమే జరుగుతోంది. దాదాపు డిసెంబర్ 23 నుంచి బంగారం ధర పెరుగుతూ వస్తోంది. ఇక నిన్న ఒక్కరోజు మాత్రం స్థిరంగా ఉండి కాస్త ఊరట కల్పించింది. తిరిగి నేడు మళ్లీ పెరిగి ఆర్నమెంట్ బంగారం రూ.50 వేల మార్కును దాటేసింది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.200 వరకూ పెరిగి రూ.50,150కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.230 వరకూ పెరిగి రూ.54,170కి చేరుకుంది. కేజీ వెండిపై రూ.400 మేర పెరిగింది. గురువారం దేశ వ్యాప్తంగా బంగారం, ధర ఎలా ఉన్నాయో చూద్దాం.

22, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ.50,150.. రూ.54,710

విజయవాడలో రూ.50,150.. రూ. 54,710

విశాఖపట్నంలో రూ.50,150.. రూ. 54,710

చెన్నైలో రూ.51,050.. రూ.55,690

బెంగళూరులో రూ.50,200.. రూ. 54,760

ఢిల్లీలో రూ. 50,300.. రూ.54,860

ముంబయిలో రూ.50,150.. రూ.54,710

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 74,600

విజయవాడలో రూ. 74,600

విశాఖపట్నంలో రూ. 74,600

చెన్నైలో రూ. 74,600

కేరళలో రూ. 74,600

బెంగుళూరులో రూ. 74,600

న్యూఢిల్లీలో రూ. 72,300

ముంబైలో రూ.72,300

Tags:    
Advertisement

Similar News