నేటి (28-11-2022) బంగారం, వెండి ధరలు..

నేడు కూడా ఒకరకంగా చెప్పాలంటే బంగారం ధర స్థిరంగానే ఉంది. కేవలం రూ.10 మాత్రమే పెరిగింది. దీనిని ఒక పెరుగుదలగా కూడా భావించలేం.

Advertisement
Update: 2022-11-28 03:36 GMT

బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. దీపావళి తర్వాత బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. తిరిగి కాస్త తగ్గినట్టే తగ్గి గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది. నేడు కూడా ఒకరకంగా చెప్పాలంటే బంగారం ధర స్థిరంగానే ఉంది. కేవలం రూ.10 మాత్రమే పెరిగింది. దీనిని ఒక పెరుగుదలగా కూడా భావించలేం. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,560 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,980 గా ఉంది. ఇక దేశీయంగా కిలో వెండి ధర రూ.61,800 వద్దే కొనసాగుతోంది. నేటి ఉదయం నమోదైన ధరల ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

22, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ.48,560.. రూ.52,980

విజయవాడలో రూ.48,560.. రూ.52,980

విశాఖపట్నంలో రూ.48,560.. రూ.52,980

ఢిల్లీలో రూ.48,710.. రూ.53,140

ముంబైలో రూ.48,560.. రూ.52,980

చెన్నైలో రూ.49,260.. రూ.53,740

కోల్‌కతాలో రూ.48,560.. రూ.52,980

బెంగళూరులో రూ.48,610.. రూ.53,030

కేరళలో రూ.48,560.. రూ.52,980

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,500

విజయవాడలో రూ.67,500

విశాఖపట్నంలో రూ.67,500

ఢిల్లీలో రూ.61,800

ముంబైలో రూ.61,800

చెన్నైలో రూ.67,500

బెంగళూరులో రూ.67,500

Tags:    
Advertisement

Similar News