చెల్లెమ్మా పురందేశ్వరీ.. మిమ్మల్ని దేవుడు క్షమిస్తాడా..?

మీ నాన్నను వెన్నుపోటు పొడిచిన మీ మరిదికి శిక్ష పడకుండా మీరు చేస్తున్న పనిని ఏమంటారో దయచేసి చెప్పగలరా..? అంటూ నిలదీశారు.

Advertisement
Update: 2023-11-16 07:17 GMT

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీరుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజాగా ఆమెకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా ఒక ట్వీట్ చేశారు.

చెల్లెమ్మా పురందేశ్వరి! జిల్లాకు మీ నాన్న పేరు పెట్టిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకొని.. మీ నాన్నను వెన్నుపోటు పొడిచిన మీ మరిదికి శిక్ష పడకుండా మీరు చేస్తున్న పనిని ఏమంటారో దయచేసి చెప్పగలరా..? అంటూ నిలదీశారు. భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా..? అంటూ ఆయన ఈ సందర్భంగా ఆ ట్వీట్‌తో ప్రశ్నించారు.

మీ సామాజిక వర్గం ప్రయోజనాల కోసం ఎన్ని విన్యాసాలు చేస్తారు అంటూ పురందేశ్వరిపై ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. అంతేకాదు.. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా నిలవడం కోసం టీడీపీ పోటీ చేయొద్దని సలహా ఇచ్చింది మీరేనంట కదా పురందేశ్వరి అంటూ మరో ట్వీట్‌లో ఆయన ప్రశ్నించారు.

మీ అందరి ఆస్తులు, నివాసాలు ఉన్న తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించుకుంటే మీరు అధికారంలో ఉన్నట్టే అని అనుకుంటున్నారట కదా అంటూ నిలదీశారు. ఎన్ని విన్యాసాలు చేస్తారమ్మా! బీజేపీ గురించి కాక సామాజికవర్గ ప్రయోజనాల కోసం ఆరాటపడుతున్నారు.. అంటూ విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు చేశారు.

Tags:    
Advertisement

Similar News