బాబు జీవితమంతా కుట్రలు, యూటర్న్‌లే - విజయసాయిరెడ్డి

వాలంటీర్ వ్యవస్థపై తన నమ్మకస్తుల ద్వారా ఈసీకి ఫిర్యాదులు చేయించి.. వారి సేవలు నిలిపివేసేలా చేసిన చంద్రబాబు.. ఇవాళ మళ్లీ వాలంటీర్లను ఉద్ధరిస్తామంటూ ముందుకు వచ్చారు.

Advertisement
Update: 2024-04-10 05:28 GMT

వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్న విషయం తెలిసిందే. నోటితో నవ్వుతూ.. నొసటితో వెక్కిరించినట్లుగా ఉంది చంద్రబాబు వ్యవహారం. ఓ వైపు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్తూనే.. మరోవైపు తన జాతి మీడియా ద్వారా వాలంటీర్‌ వ్యవస్థపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.

వాలంటీర్ వ్యవస్థపై తన నమ్మకస్తుల ద్వారా ఈసీకి ఫిర్యాదులు చేయించి.. వారి సేవలు నిలిపివేసేలా చేసిన చంద్రబాబు.. ఇవాళ మళ్లీ వాలంటీర్లను ఉద్ధరిస్తామంటూ ముందుకు వచ్చారు. వాలంటీర్ల జీతాన్ని రూ.10 వేలకు పెంచుతామంటూ గొప్పలకుపోయారు.


ఇక వాలంటీర్ వ్యవస్థపై రోజుకో రంగు మారుస్తున్న చంద్రబాబు తీరుపై మండిపడ్డారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. వాలంటీర్ వ్యవస్థపై దిగజారుడు ప్రచారం చేసి వాళ్ల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీశాడని గుర్తు చేశారు విజయసాయి. మగవాళ్లు లేనప్పుడు ఇంటికి వెళ్లి తలుపులు కొడుతున్నారంటూ చంద్రబాబు కించపరిచిన విషయాన్ని విజయసాయిరెడ్డి తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. కానీ ఇవాళ అదే వాలంటీర్ వ్యవస్థ చరిత్ర సృష్టించడంతో.. వాళ్లతో చంద్రబాబు కాళ్లబేరానికి వచ్చాడంటూ విమర్శించారు విజయసాయి. చంద్రబాబు రాజకీయ జీవతం మొత్తం కుట్రలు, యూటర్న్‌లేనని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా వాలంటీర్ల విలువ అర్థమైందా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. 

Tags:    
Advertisement

Similar News