ఇంకెంత మంది ఉసురుపోసుకుంటావు.. బాబుపై విజయసాయిరెడ్డి ఫైర్‌

రాజకీయ ప్రయోజనాల కోసం ఇంకెంత మంది అమాయకుల ఉసురుపోసుకుంటావు అంటూ చంద్రబాబును నిలదీశారు విజయసాయిరెడ్డి.

Advertisement
Update: 2024-04-06 05:31 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై మరోసారి మండిపడ్డారు నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే పెన్షన్ అందకుండా చేసి 40 మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడంటూ ఫైర్ అయ్యారు. చావు డప్పుల మోత వింటే చంద్రబాబుకు ఉల్లాసంగా ఉంటుందంటూ ఎద్దేవా చేశారు విజయసాయి రెడ్డి.

చంద్రబాబు గత చరిత్రను గుర్తుచేశారు. 2000 సంవత్సరంలో ఆగస్టు 28న కరెంటు ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా బషీర్‌బాగ్‌లో నిరసన తెలిపిన రైతులపై కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుదన్నారు విజయసాయిరెడ్డి. రాజమండ్రిలో పుష్కరాల సందర్భంగా 30 మంది ప్రాణాలను బలి తీసుకుని మరణమృదంగం మోగించాడన్నారు.


కందుకూరులో ఇరుకు వీధిలో సభ పెట్టి 8 మంది ఉసురు తీసిన విషయం నెల్లూరు జిల్లా ప్రజలు ఇంకా మర్చిపోలేదని గుర్తుచేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇంకెంత మంది అమాయకుల ఉసురుపోసుకుంటావు అంటూ చంద్రబాబును నిలదీశారు విజయసాయి.

Tags:    
Advertisement

Similar News