మీ ఆలోచనలు ఇంత వికృతమా బాబూ.. - చంద్రబాబుపై నిప్పులు చెరిగిన సజ్జల

‘వైఎస్‌ జగన్‌ రాజకీయ వారసత్వం గురించి మాట్లాడితే.. చెల్లెలి పుట్టుక గురించి మాట్లాడారంటూ వక్రీకరించిన మీ వికృతపు ఆలోచలు చూస్తే చంద్రబాబు ఎంతగా దిగజారిపోయారో అర్థం అవుతోంది’ అంటూ ఆయన ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా దుయ్యబట్టారు.

Advertisement
Update: 2024-04-26 02:57 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు. ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా ఆయన తీరును దుయ్యబట్టారు. మీరు పెట్టిన ట్వీట్‌ చూస్తే.. చివరకు పశువులు కూడా అసహ్యించుకునే స్థాయికి వెళ్లిపోయారని స్పష్టమవుతోంది.. అంటూ మండిపడ్డారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. పులివెందులలో గురువారం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తూ.. షర్మిల, సునీతల కుటిల రాజకీయాలను పరోక్షంగా విమర్శించారు. ఈ క్రమంలో ఆయన వీళ్లా వైఎస్సార్‌ వారసులు అంటూ వారి రాజకీయ వారసత్వం గురించి ప్రశ్నించారు.

అయితే.. జగన్‌ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ చంద్రబాబు ట్విట్ట‌ర్‌ (ఎక్స్‌)లో ట్వీట్‌ చేశారు. ‘తోడబుట్టిన చెల్లెలి పుట్టుక పైనా.... మహాలక్ష్మిగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా? ఎంత నీచం! ఇది కాదా వికృత మనస్తత్వం?’ అంటూ ఆయన చేసిన ట్వీట్‌పై సజ్జల స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘వైఎస్‌ జగన్‌ రాజకీయ వారసత్వం గురించి మాట్లాడితే.. చెల్లెలి పుట్టుక గురించి మాట్లాడారంటూ వక్రీకరించిన మీ వికృతపు ఆలోచలు చూస్తే చంద్రబాబు ఎంతగా దిగజారిపోయారో అర్థం అవుతోంది’ అంటూ ఆయన ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా దుయ్యబట్టారు. ‘మీరు పెట్టిన ట్వీట్‌ చూస్తే.. చివరకు పశువులు కూడా అసహ్యించుకునే స్థాయికి వెళ్లిపోయారని స్పష్టమవుతోంది‘ అని చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News