జగన్‌కు షాకెలాగవుతుంది..?

మైలవరం, ప్రత్తిపాడు, జగ్గంపేట ఎమ్మెల్యేలు సిద్ధం బహిరంగసభకు దూరంగా ఉన్నారట. తాము బహిరంగసభలో పాల్గొనేది లేదని తెగేసి చెప్పటంతో జగన్ కు షాక్ కొట్టినట్లయ్యిందని కథనం రాసుకుని తృప్తిపడిపోతోంది ఎల్లోమీడియా.

Advertisement
Update: 2024-02-04 05:44 GMT

తెలుగుదేశంపార్టీ నేతలు, ఎల్లోమీడియా వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. జరుగుతున్న విషయం ఏదైనాసరే తాము అనుకున్నదే అచ్చేస్తారు. ఇప్పుడు విషయం ఏమిటంటే.. దెందులూరులో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న సిద్ధం ఎన్నికల బహిరంగ సభ జరిగింది. సభకు జనాలు కూడా పెద్దఎత్తున హాజరయ్యారు. ముందు భీమిలిలో ఇప్పుడు దెందులూరులో జరిగిన బహిరంగ సభలు గ్రాండ్ సక్సెస్ అవటాన్ని మొత్తం ఎల్లోబ్యాచ్ తట్టుకోలేకపోతోంది. అందుకని ఏమిరాయాలో తెలీక జగన్‌కు ముగ్గురు ఎమ్మెల్యేలు షాకిచ్చారంటూ రచ్చరచ్చ చేస్తున్నారు.

మైలవరం, ప్రత్తిపాడు, జగ్గంపేట ఎమ్మెల్యేలు సిద్ధం బహిరంగసభకు దూరంగా ఉన్నారట. తాము బహిరంగసభలో పాల్గొనేది లేదని తెగేసి చెప్పటంతో జగన్ కు షాక్ కొట్టినట్లయ్యిందని కథనం రాసుకుని తృప్తిపడిపోతోంది ఎల్లోమీడియా. మైలవరంలో వసంత కృష్ణప్రసాద్, ప్రత్తిపాడులో పర్వత శ్రీ పూర్ణచంద్రప్రసాద్, జగ్గంపేటలో జ్యోతుల చంటిబాబు పార్టీకి చాలాకాలంగా దూరంగానే ఉంటున్నారు. ప్రత్తిపాడు, జగ్గంపేట ఎమ్మెల్యేల‌కు టికెట్లు ఇచ్చేదిలేదని జగన్ ఎప్పుడో చెప్పేశారు. మైలవరం ఇన్‌చార్జిగా తిరుపతిరావును ప్రకటించింది శుక్రవారమే.

ఎప్పుడైతే తమకు టికెట్లు దక్కవని అర్థ‌మైపోయిందో అప్పటినుంచే వీళ్ళు వైసీపీలో పెద్దగా కనబడటంలేదు. పైగా జ్యోతుల అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు కూడా. కాబట్టి పార్టీ కూడా పై ముగ్గురు ఎమ్మెల్యేల‌ను చాలారోజుల క్రితమే వదిలేసింది. వాస్తవం ఇలాగుంటే వీళ్ళముగ్గురు దెందులూరు సభకు హాజరుకాకపోతే అది జగన్ కు షాక్ ఎలాగ అవుతుందో అర్థంకావటంలేదు. ఊహించని పరిణామం ఏదైనా జరిగి పార్టీకి నష్టం జరుగుతుందని అనుకుంటే అప్పుడు దాన్ని షాక్ అని చెప్పినా అర్థ‌ముంది.

ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కూడా ఎమ్మెల్యేల‌ను వదిలేసింది. ఇక ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చేరినా జగన్ పట్టించుకోరు. జగన్ పట్టించుకోరంటే పార్టీ మొత్తం దూరంగానే పెట్టేస్తుంది. బహిరంగసభకు పై ముగ్గురు ఎమ్మెల్యేలు వస్తారని జగన్ అండ్ కో ఎలాగ అనుకుంటారు..? రాకపోతే పార్టీకి వచ్చే నష్టమేముంది..? ఇక్కడ విషయం ఏమిటంటే.. ప్రతి విషయాన్ని జగన్ కు వ్యతిరేకంగా రాసి బురదచల్లేసి తృప్తిపడటమే టార్గెట్ గా పెట్టుకున్నది ఎల్లోమీడియా. అందుకనే ఇలాంటి పిచ్చి స్టోరీలు రాసుకుంటోంది.

Tags:    
Advertisement

Similar News