వైజాగ్ లో వందేభారత్ రైలుపై రాళ్ళ దాడి

ఈ రోజు ఆ రైలు ను ట్రయల్ రన్ లో భాగంగా చెన్నై నుంచి విశాఖపట్నం తీసుకొచ్చారు. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి మర్రి పాలెం రైల్వే యార్డుకు తీసుకెళ్తుండగా కంచరపాలెం వద్ద రైలుపై రాళ్ళ దాడి జరిగింది.

Advertisement
Update: 2023-01-11 16:17 GMT

విశాఖపట్నంలో వందేభారత్ రైలుపై గుర్తు తెలియని దుండగులు రాళ్ళదాడికి పాల్పడ్డారు. సికిందరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు నడవబోయే ఈ రైలును ప్రధాని మోడీ ప్రారంభించాల్సిఉంది.

ఈ రోజు ఆ రైలు ను ట్రయల్ రన్ లో భాగంగా చెన్నై నుంచి విశాఖపట్నం తీసుకొచ్చారు. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి మర్రి పాలెం రైల్వే యార్డుకు తీసుకెళ్తుండగా కంచరపాలెం వద్ద రైలుపై రాళ్ళ దాడి జరిగింది. ఈ ఘటనలో రెండు బోగీల అద్దాలు ధ్వంసం అయ్యాయి.

ఈ ఘటనపై డీఆర్ ఎం అనూప్ సత్ప‌తి విచారణకు ఆదేశించారు. 

Tags:    
Advertisement

Similar News