క్రేన్ మీద వచ్చి, శాలువా కప్పి.. పవన్ పర్యటనలో హైలైట్ ఇదే

ఓ అభిమాని తనని తాను క్రేన్ తాళ్లకు వేలాడదీసుకుని పవన్ దగ్గరకు వచ్చాడు. క్రేన్ లో ముందుకు కదులుతూ వచ్చి, పవన్ దగ్గరకు రాగానే శాలువా కప్పి, పూలమాల వేశాడు.

Advertisement
Update: 2023-07-17 08:23 GMT

పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటనకు హైలెట్ గా నిలిచింది ఈ వీడియో. ఓ అభిమాని ఏకంగా క్రేన్ పై వచ్చి పవన్ కల్యాణ్ కి శాలువా కప్పి, మెడలో దండ వేశారు. తిరుపతి పట్టణంలో ఆ అభిమాని చేసిన ఈ ఫీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానం ఉంటుంది, కానీ మరీ ఇంత పిచ్చి అభిమానమా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈరోజు పవన్ పర్యటనలో ఇదే హైలెట్ అంటున్నారు.


ఇప్పటి వరకూ క్రేన్ ద్వారా గజమాలలు, పెద్ద పెద్ద దండలు తెచ్చి తమ అధినాయకులకు అలంకరించి పొంగిపోయే అభిమానుల్ని చూసి ఉంటాం. కానీ తొలిసారిగా ఓ అభిమాని తనని తాను క్రేన్ తాళ్లకు వేలాడదీసుకుని పవన్ దగ్గరకు వచ్చాడు. ఓ చేతిలో శాలువా, మరో చేతిలో దండ పెట్టుకుని బ్యాలెన్స్ చేస్తూ పవన్ కి దగ్గరగా వచ్చాడు. క్రేన్ లో అంత ఎత్తునుంచి వస్తున్నాడు కాబట్టి ఎవరూ అడ్డుకునే పరిస్థితి లేదు, పవన్ కూడా అతడిని వారించలేదు. అలా క్రేన్ లో ముందుకు కదులుతూ వచ్చి, పవన్ దగ్గరకు రాగానే శాలువా కప్పి, పూలమాల వేశాడు. జై జనసేన, జై పవన్ కల్యాణ్ అంటూ నినాదాలు చేశాడు ఆ అభిమాని.

పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటనలో అభిమానుల్ని కలిసే అవకాశం లేదు. దూరం నుంచి చెయ్యి ఊపితే ఏం బాగుంటుంది అనుకున్నాడేమో, ఏకంగా క్రేన్ ఐడియా వేశాడు ఆ అభిమాని. అంతా పక్కాగా జరిగింది కాబట్టి పవన్ కూడా ఊపిరి పీల్చుకున్నాడు. ఏమాత్రం క్రేన్ వ్యవహారం తేడా కొట్టినా ఈ సాహసం ప్రమాదంగా మారేది. కానీ పక్కా ప్లానింగ్ తో క్రేన్ లో వచ్చి అభిమాన నాయకుడికి పూలమాల వేసి వెళ్లిపోయాడు. సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు ఆ వీరాభిమాని. 

Tags:    
Advertisement

Similar News