ముగిసిన గడువు.. ఏపీలో మొత్తం 4,941 నామినేషన్ల దాఖలు
అసెంబ్లీ, లోక్సభకు దాఖలైన నామినేషన్లను రేపు (శుక్రవారం) పరిశీలించనున్నారు. నిబంధనల ప్రకారం లేని నామినేషన్లను తిరస్కరిస్తారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగిసిందని అధికారులు ప్రకటించారు. అసెంబ్లీ, లోక్సభలకు కలిసి రాష్ట్రంలో మొత్తం 4,941 నామినేషన్లు వచ్చాయని అధికారులు చెప్పారు.
లోక్సభకు 731, అసెంబ్లీకి 4,210
ఇందులో 25 లోక్సభ స్థానాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 4,210 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు.
రేపు పరిశీలన
అసెంబ్లీ, లోక్సభకు దాఖలైన నామినేషన్లను రేపు (శుక్రవారం) పరిశీలించనున్నారు. నిబంధనల ప్రకారం లేని నామినేషన్లను తిరస్కరిస్తారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు అభ్యర్థులకు ఈనెల 29 వరకు గడువు ఉంది.