ఇది ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది

ఢిల్లీలో మేనెజ్‌మెంట్‌ స్కిల్‌ ఉన్న వారితో పైరవీలు చేసేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారని.. ఆ గుంపులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చేరిపోయారంటూ కామెంట్ చేశారు.

Advertisement
Update: 2023-09-12 05:30 GMT

చంద్రబాబు అరెస్టు కేవలం ట్రైలర్ మాత్రమేనన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయనపై ఇంకా అనేక కేసులున్నాయ‌ని, త్వరలోనే మరిన్ని కేసులు తెరపైకి వస్తాయని చెప్పారు. ఆ కేసులన్ని బయటకు వస్తే చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలన్నారు. చంద్రబాబు అరెస్టు అయితే రాష్ట్రం అగ్ని గుండం అవుతుందని తెలుగుదేశం భావిస్తే.. అది కాస్తా బుగ్గిపాలైందని సెటైర్లు వేశారు. తెలుగుదేశం బంద్‌ను చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్‌ కూడా పట్టించుకోలేదన్నారు.

ఢిల్లీలో మేనెజ్‌మెంట్‌ స్కిల్‌ ఉన్న వారితో పైరవీలు చేసేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారని.. ఆ గుంపులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చేరిపోయారంటూ కామెంట్ చేశారు. పతనం అంటే ఏంటో చంద్రబాబుకు తెలుస్తోందని.. ఆయన నిర్మించిన దుర్మార్గపు వ్యవస్థ కూలిపోతోందని చెప్పారు.

ఇక జనసేనాని పవన్‌పైనా ఫైర్ అయ్యారు పెద్దిరెడ్డి. పవన కల్యాణ్ గతంలో వలంటీర్లపై, ఇప్పుడు హత్యలు అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ ఆరోపణలపై పోలీసు విచారణకు కోరతామని.. పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయనడం పవన్‌కు అలవాటుగా మారిందన్నారు.

Tags:    
Advertisement

Similar News