మార్చి 12.. వైసీపీలో ముద్రగడ చేరికకు ముహూర్తం ఫిక్స్

బేషరతుగా ముద్రగడ వైసీపీలో చేరేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఎలాంటి సీట్లు, టికెట్ తను ఆశించడం లేదని ముద్రగడ చెప్పినట్లు తెలుస్తోంది.

Advertisement
Update: 2024-03-06 09:38 GMT

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైంది. ఈనెల 12న ముద్రగడ ఫ్యామిలీ వైసీపీ కండువా కప్పుకుంటుందని సమాచారం. తాజాగా ముద్రగడ ఇంటికి వెళ్లిన వైసీపీ నేత జక్కంపూడి గణేష్.. ఆయనతో చర్చలు జరిపారు.

వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డితోనూ ముద్రగడను ఫోన్‌లో మాట్లాడించారు జక్కంపూడి గణేష్‌. వైసీపీలోకి రావాలని ముద్రగడను మిథున్‌ రెడ్డి ఫోన్‌లో కోరినట్లు తెలుస్తోంది. సీఎం జగనే పార్టీలోకి ఆహ్వానించమన్నారని ముద్రగడకు ఫోన్‌లో చెప్పారు మిథున్ రెడ్డి.

బేషరతుగా ముద్రగడ వైసీపీలో చేరేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఎలాంటి సీట్లు, టికెట్ తను ఆశించడం లేదని ముద్రగడ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ముద్రగడను పిఠాపురంలో పవన్‌పై పోటీలో దించేందుకు వైసీపీ పావులు కదుపుతున్నట్లు సమాచారం.

Tags:    
Advertisement

Similar News