దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు - కేఏ పాల్‌ సంచలన ఆరోపణలు

చంద్రబాబుకు నిజంగా న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంటే విచారణకు సహకరించాలన్నారు. మరోపక్క టీడీపీ నేతలు డబ్బులు ఇచ్చి పెయిడ్‌ ఉద్యమాలు చేయిస్తున్నారని పాల్‌ విమర్శించారు.

Advertisement
Update: 2023-09-27 15:59 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత అవినీతిపరుడని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఆరు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఆయన అవినీతి ఆకాశమంత ఎత్తుకు చేరుకుందని విమర్శించారు. లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన వ్యక్తి జైలు శిక్ష అనుభవించాల్సిందేనని చెప్పారు. చంద్రబాబు అవినీతిలో ఆయన కుమారుడు నారా లోకేశ్‌కు కూడా భాగస్వామ్యం ఉందని ఆయన చెప్పారు.

బుధవారం విశాఖపట్నంలో కేఏ పాల్‌ విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు నిజంగా న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంటే విచారణకు సహకరించాలన్నారు. మరోపక్క టీడీపీ నేతలు డబ్బులు ఇచ్చి పెయిడ్‌ ఉద్యమాలు చేయిస్తున్నారని పాల్‌ విమర్శించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడిని కూడా అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కేవలం 25 సీట్ల కోసం అమ్ముడుపోయాడని పాల్‌ మండిపడ్డారు. ప్యాకేజీ కోసమే కాపులను పవన్‌ కల్యాణ్‌ తాకట్టు పెట్టారని ఆరోపించారు.


Tags:    
Advertisement

Similar News