పవన్ కి ప్రాణ హాని.. పాల్ సంచలన కామెంట్లు

వారాహి యాత్రలో తానే సీఎం అని పవన్ ప్రకటించుకోవాలని సలహా ఇచ్చారు కేఏపాల్. అలా ప్రకటించకపోతే ఆ యాత్రను ఎవరూ లెక్కచేయరని అన్నారు.

Advertisement
Update: 2023-06-14 10:25 GMT

కేఏ పాల్ విమర్శలు, వెటకారాలు, అప్పుడప్పుడు తమ్ముడూ అంటూ పవన్ పై చూపించే వల్లమాలిన ప్రేమ.. అందరికీ తెలిసినవే. అయితే ఇప్పుడాయన ఏకంగా పవన్ కి ప్రాణ హాని ఉందని తేల్చేశారు. అది కూడా చంద్రబాబు వల్లేనని అంటున్నారు పాల్. వచ్చే ఎన్నికల్లో సింపతీ ఓట్లకోసం పవన్ కి చంద్రబాబు ప్రాణహాని తలపెట్టవచ్చని, వేరే వాళ్లతో పవన్ ని చంపించేసి.. ఆ నెపం జగన్ పై నెట్టేసి ఓట్లు కొల్లగొట్టాలనుకోవచ్చని చెప్పారు. ఆ వ్యూహంలో చిక్కుకోవద్దని, చంద్రబాబుకి దూరంగా ఉండాలంటూ హితబోధ చేశారు పాల్.

సీఎం నేనే అని చెప్పుకో..

వారాహి యాత్రలో తానే సీఎం అని పవన్ ప్రకటించుకోవాలని సలహా ఇచ్చారు కేఏపాల్. అలా ప్రకటించకపోతే ఆ యాత్రను ఎవరూ లెక్కచేయరని అన్నారు. వారాహి యాత్ర ఎందుకోసం అని ప్రశ్నించారు. కేవలం సీఎం జగన్ ని తిడుతూ.. చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలనుకోవడం మూర్ఖత్వం అని అన్నారు పాల్.

బీసీల్లో, కాపుల్లో ముఖ్యమంత్రులు లేరని.. అప్పట్లో చిరంజీవి ప్రయత్నించినా కొన్ని తప్పుల వల్ల ఆయన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి, ఇప్పుడు ఆ పార్టీకి కూడా దూరంగా ఉన్నారని, కనీసం ఇప్పుడైనా పవన్ కల్యాణ్ ఆ స్థానం తీసుకోవాలన్నారు కేఏపాల్. ప్రజాశాంతి పార్టీతో కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు. 

Tags:    
Advertisement

Similar News