చంద్రబాబుకి మళ్లీ షాక్.. రిమాండ్ పొడిగింపు

మెడికల్‌ రిపోర్టులు ఎప్పటికప్పుడు కోర్టుకు సమర్పించాలని జడ్జి ఆదేశించారు. చంద్రబాబు రిమాండ్‌ పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు.

Advertisement
Update: 2023-10-19 08:16 GMT

చంద్రబాబు రిమాండ్ ని ఏసీబీ కోర్టు నవంబర్-1 వరకు పొడిగించింది. దీంతో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనకు మరోసారి షాక్ తగిలినట్టయింది. ఈ రోజుతో చంద్రబాబు రిమాండ్ ముగిసిపోతుంది. ఈ సందర్భంలో ఆయన్ను కోర్టు ముందు వర్చువల్ గా హాజరుపరిచారు. రిమాండ్ పొడిగిస్తున్నట్టు జడ్జి ఆదేశాలు జారీ చేశారు.

విచారణ సందర్భంలో తన ఆరోగ్యం, భద్రత గురించి జడ్జి ఎదుట చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయని ఆయన జడ్జికి చెప్పారు. దీంతో అధికారుల్ని జడ్జి వివరణ కోరారు. మెడికల్‌ టీం ఉందని, ఎప్పటికప్పుడు ఆయనకు వైద్యపరీక్షలు జరుపుతున్నామని.. జైలు అధికారులు జడ్జికి వివరణ ఇచ్చారు. దీంతో.. మెడికల్‌ రిపోర్టులు ఎప్పటికప్పుడు కోర్టుకు సమర్పించాలని జడ్జి ఆదేశించారు. చంద్రబాబు రిమాండ్‌ పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు.

సెక్యూరిటీ విషయంలో తనకు అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కూడా జడ్జి స్పందించారు. సెక్యూరిటీ విషయంలో అనుమానాలు ఉంటే రాతపూర్వకంగా తెలియజేయాలని కోర్టు ఆయనకు సూచించింది. అలాగే చంద్రబాబు రాసే లేఖను సీల్‌ చేసి తనకు పంపాలని అధికారుల్ని జడ్జి ఆదేశించారు.


Tags:    
Advertisement

Similar News