చంద్రబాబు తాజా వెన్నుపోట్లు ఇవీ..

జంగా కృష్ణమూర్తికి గురజాల టీడీపీ టికెట్‌ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి, జగన్‌పై ఆయన చేత తీవ్రమైన వ్యాఖ్యలు చేయించారు.

Advertisement
Update: 2024-03-05 11:43 GMT

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోట్లకు పెట్టింది పేరుగా మారారు. తాజాగా మరో ఇద్దరు నాయకులను చంద్రబాబు నమ్మించి మోసం చేశారు. వైసీపీ నుంచి బయటకు రప్పించి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేయించి ఇప్పుడు వారికి మొండిచేయి చూపించేందుకు ఆయన సిద్దపడ్డారు. పెనమలూరు టికెట్‌ ఇస్తానని కొలుసు పార్థసారథికి చంద్రబాబు హామీ ఇచ్చారు. దాంతో జగన్‌పై పార్థసారథి అసభ్యకరమైన పదజాలంతో విమర్శలు చేశారు.

ఇప్పుడు చంద్రబాబు ఆయనకు పెనమలూరు టికెట్‌ ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. నూజివీడు నుంచి టీడీపీ టికెట్‌ ఇస్తానని చంద్రబాబు ఇప్పుడు పార్థసారథికి చెప్పుతున్నారు. జగన్‌పై పార్థసారథి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వెనక్కి వెళ్లలేరు. దీంతో ఆయన చంద్రబాబు చెప్పినట్లు నూజివీడు నుంచి పోటీ చేయాలి. లేదా రాజకీయాల నుంచి తప్పుకోవాలి.

అలాగే, జంగా కృష్ణమూర్తికి గురజాల టీడీపీ టికెట్‌ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి, జగన్‌పై ఆయన చేత తీవ్రమైన వ్యాఖ్యలు చేయించారు. దాంతో పల్నాడు వేదికగా టీడీపీలో చేరడానికి జంగా కృష్ణమూర్తి సిద్ధపడ్డారు. అయితే, ఆయన అనూహ్యమైన పరాభవం ఎదురైంది. ఆయనను చంద్రబాబు పట్టించుకోలేదు.

ఈ స్థితిలో జంగా కృష్ణమూర్తి బేషరతుగా టీడీపీలో చేరాల్సిన పరిస్థితిలో చిక్కుకున్నారు. టికెట్‌ అడిగే పరిస్థితి కూడా ఆయనకు లేకుండా చేశారు. లేదంటే ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలి. ఈ రకంగా చంద్రబాబు కబంధ హస్తాల్లో చిక్కుకున్న నేతలు విలవిలలాడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News