ఏపీలో సీఎం సీటు మళ్లీ జగన్‌దే.. బీజేపీ మహిళా నేత

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి బరిలోకి దిగుతున్నాయని, అయితే ‘పొత్తు పెట్టుకున్నాం. సులభంగా గెలిచేద్దాం... జగన్‌ను సాగనంపుదాం’ అంటే మాత్రం అంత సులభం కాదని ఆమె ఆ వీడియోలో అన్నారు.

Advertisement
Update: 2024-03-16 13:31 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నాయకత్వంలోని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయే మళ్లీ గెలుస్తుందని బీజేపీ నేత, సినీ నటి మాధవీలత అన్నారు. తమ పార్టీ టీడీపీ, జనసేనలతో పొత్తు పెట్టుకుందని తెలిసి కూడా ఆమె ఆ మాట అన్నారు. మళ్లీ వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. ఎంత మంది కలిసి వచ్చినా కచ్చితంగా జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారన్నారు.

ఆ మేరకు ఆమె తన అఫిషియల్‌ ఫేస్‌బుక్‌లో ఒక వీడియోను షేర్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి బరిలోకి దిగుతున్నాయని, అయితే ‘పొత్తు పెట్టుకున్నాం. సులభంగా గెలిచేద్దాం... జగన్‌ను సాగనంపుదాం’ అంటే మాత్రం అంత సులభం కాదని ఆమె ఆ వీడియోలో అన్నారు.

జగన్‌కు బలమైన రాజకీయ ప్రణాళికలు ఉన్నాయని, అంతేకాదు, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. జగన్‌కు ప్రజల మద్దతు ఉందని మాధవీలత అన్నారు. ప్రజలు ఐదేళ్లుగా ఒకే ధోరణిలో ఉన్నారని, ప్రజలు ఆ ధోరణిలోకి వెళ్లిపోయారని ఆమె అన్నారు. విజయం సాధించాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ చాలా చాలా కష్టపడాల్సి ఉంటుందని స్ప‌ష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News