బాలకృష్ణ మెడలో జనసేన కండువా

హిందూపురంలో జరిగిన టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశానికి బాలకృష్ణ మెడలో జనసేన కండువా వేసుకుని రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Advertisement
Update: 2023-11-16 12:29 GMT

టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇవాళ హిందూపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశానికి ఆయన టీడీపీ కండువాతో పాటు జనసేన కండువా కూడా వేసుకొని రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

టాలీవుడ్‌లో సినిమాల పరంగా ఎప్పుడూ మెగా వర్సెస్ నందమూరి అన్నట్లుగానే వ్యవహారం ఉంటుంది. మెగా, నందమూరి ఫ్యాన్స్ ఒకరిపై మరొకరు నిత్యం దూషణలు చేసుకుంటూనే ఉంటారు. ఇక ఈ రెండు కుటుంబాలకు చెందిన హీరోల సినిమాలు ఒకేసారి విడుదలైతే ఒకరినొకరు కవ్వించుకోవడంతోపాటు గొడవలకు దిగుతుంటారు.

మెగా, నందమూరి హీరోలు ఓకే వేదికను పంచుకోవడం కూడా తక్కువే. చిరంజీవి, బాలకృష్ణ తరం నుంచి పరిస్థితి ఇలాగే ఉంది. అలాంటిది టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ఇరు హీరోల ఫ్యాన్స్ మధ్య దూరం కొంత తగ్గిందనే చెప్పొచ్చు. సినిమాల పరంగా కొంత డిస్టెన్స్ ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం మెగా, నందమూరి ఫ్యాన్స్ ఒక్కటిగానే ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో ఇవాళ హిందూపురంలో జరిగిన టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశానికి బాలకృష్ణ మెడలో జనసేన కండువా వేసుకుని రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బాలకృష్ణ తన ప్రసంగంలో కూడా పవన్ కళ్యాణ్ ను ప్రశంసించారు. తనకూ, పవన్ కళ్యాణ్ కు మధ్య సారూప్యతలు ఉన్నాయని, ఇద్దరం ముక్కుసూటిగా మాట్లాడతామని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. వైసీపీని ఓడించేందుకు పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ, జనసేన శ్రేణులు ఇలాగే ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు సాగాలని బాలకృష్ణ కోరారు. బాలకృష్ణ తన ప్రసంగం చివర్లో జై తెలుగుదేశం..జై జనసేన..అంటూ నినాదం చేయడం అందరినీ ఆకట్టుకుంది.

Tags:    
Advertisement

Similar News