ఎన్టీఆర్‌ని చెప్పులతో కొట్టించింది కూడా ప్రజల కోసమేనా..?

ఆనాడు మీ తండ్రి ఎన్టీఆర్‌ని చెప్పులతో కొట్టించింది కూడా ప్రజల కోసమేనా అని నిలదీశారు. ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచింది ప్రజల కోసమేనా..? అని ప్రశ్నించారు.

Advertisement
Update: 2023-09-16 12:59 GMT

చంద్రబాబు నాయుడు జైలులో కూడా ప్రజల కోసమే ఆలోచిస్తారని ఆయన భార్య నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై ఏపీఎఫ్‌డీసీ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భువనేశ్వరి సానుభూతి రాజకీయం చేయడంపై మండిపడ్డారు. చంద్రబాబు జైలులో సైతం ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడని అనడం దుర్మార్గమన్నారు. ఆనాడు మీ తండ్రి ఎన్టీఆర్‌ని చెప్పులతో కొట్టించింది కూడా ప్రజల కోసమేనా అని నిలదీశారు. ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచింది ప్రజల కోసమేనా..? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ పదవిని చంద్రబాబు అక్రమంగా లాక్కున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ విషయాలు నారా భువనేశ్వరికి గుర్తులేవా..? అని నిలదీశారు.

రామోజీ రాజకీయ వ్యభిచారం..

ఈనాడు అధినేత రామోజీరావు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని పోసాని విమర్శించారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో కుట్రలు అంటూ ఈనాడులో రాస్తున్న కథనాలపై ఆయన ధ్వజమెత్తారు. జైలు సూపరింటెంటింటెండ్‌ రాహుల్‌ భార్య అనారోగ్యంతో మృతి చెందితే రామోజీరావు పిచ్చి రాతలు రాయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. రామోజీ చనిపోతే ఆయన కుటుంబ సభ్యులు వెళ్లరా..? అని ఈ సందర్భంగా ప్ర‌శ్నించారు. తన భార్య అనారోగ్యం కారణంగా జైలర్‌ రాహుల్‌ సెలవు పెట్టి వెళితే.. ఈనాడులో తప్పుడు కథనాలు రాశారని మండిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News