ఎల్లో పేపర్ పై జనసేనాని సంతకం.. అంబటి సెటైర్లు

పవన్ ప్రసంగంలోని ప్రతి మాటకీ అంబటి కౌంటర్లు ఇచ్చారు. జనసేన పదో ఆవిర్భావ దినోత్సవ సందేశం ఇదేనంటూ ఆయన కామెంట్ చేశారు.

Advertisement
Update: 2023-03-15 05:08 GMT

జనసేన పదో ఆవిర్భావ సభ తర్వాత వైసీపీ నుంచి ఊహించిన రీతిలోనే రియాక్షన్ వచ్చింది. అయితే అసెంబ్లీ సమావేశాలు ఉండటం, సభకు ముందురోజే పేర్ని నాని కోటా పూర్తవడంతో సభ తర్వాత పెద్దగా రియాక్షన్లు రాలేదు. మంత్రి అంబటి రాంబాబు మాత్రం పవన్ కల్యాణ్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ట్విట్టర్లో ఆయన దుమ్ము దులిపేశారు.


ఆంధ్రజ్యోతిపై రియాక్షన్ ఏదీ..?

గతంలో వైసీపీ నేతలు ప్యాకేజీ స్టార్ అంటే.. పవన్ కల్యాణ్ బహిరంగ సభలో చెప్పు చూపించారని, ఇటీవల ఆంధ్రజ్యోతి కూడా ప్యాకేజీ అంటూ కథనాలు రాసిందని, మరి దానికి పవన్ రియాక్షన్ ఏంటని ప్రశ్నించారు అంబటి. కనీసం ఆవిర్భావ సభలో కూడా ఆయన ఆంధ్రజ్యోతి కథనాన్ని ఖండించలేదని గుర్తు చేశారు.

కాపులు నడుం బిగించాలా..?

జనసేన సభలో కాపులంతా నడుం బిగించాలని పిలుపునిచ్చారు పవన్ కల్యాణ్. “కాపులందరూ నడుం బిగించండి, నాదెండ్ల, కల్యాణ్ బాబు ప్యాకేజీ బిగిస్తారు” అంటూ సెటైర్లు పేల్చారు అంబటి రాంబాబు.

ఎల్లో పేపర్ పై సంతకం..

పవన్ ప్రసంగంలోని ప్రతి మాటకీ అంబటి కౌంటర్లు ఇచ్చారు. జనసేన పదో ఆవిర్భావ దినోత్సవం సందేశం ఇదేనంటూ ఆయన కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన బలమైన సంతకం ఉంటుందని, అయితే పవన్ ఆ సంతకం ఎల్లో పేపర్ పై ఉంటుందని చెప్పారు. మొత్తమ్మీద పవన్ కల్యాణ్ కోసం కాపులు నడుం బిగిస్తే, వారి పేరు చెప్పుకుని పవన్ ప్యాకేజీ తెచ్చుకుంటారంటూ ఎద్దేవా చేశారు అంబటి. దీనిపై ఇంకా జనసేన నుంచి రియాక్షన్లు రాలేదు.

Tags:    
Advertisement

Similar News