వేములవాడ దేవాలయంలో పసికందు కిడ్నాప్

  సోమవారం తెల్లవారుజామున వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఓ పసికందును గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన లావణ్య తన ఇద్దరు కుమారులతో కలిసి గత నాలుగు రోజులుగా గుడి మెట్ల వద్ద ఉంటోంది. ఆదివారం రాత్రి లావణ్యకు మద్యం తాగించిన‌ గుర్తుతెలియని వ్యక్తులు 21 రోజుల వయసున్న ఆమె చిన్న కుమారుడిని ఎత్తుకొని పరారయ్యారు. దీంతో లావణ్య వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె […]

Advertisement
Update: 2022-05-16 06:03 GMT

 

సోమవారం తెల్లవారుజామున వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఓ పసికందును గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన లావణ్య తన ఇద్దరు కుమారులతో కలిసి గత నాలుగు రోజులుగా గుడి మెట్ల వద్ద ఉంటోంది. ఆదివారం రాత్రి లావణ్యకు మద్యం తాగించిన‌ గుర్తుతెలియని వ్యక్తులు 21 రోజుల వయసున్న ఆమె చిన్న కుమారుడిని ఎత్తుకొని పరారయ్యారు. దీంతో లావణ్య వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి కోసం గాలింపు చేపట్టారు.

Tags:    
Advertisement

Similar News