అది మహేష్ తిరస్కరించిన మూవీనే?

నూతన సంవత్సర కానుకగా తన కొత్త సినిమా ప్రకటించాడు సందీప్ రెడ్డి వంగ. తెలుగులో అర్జున్ రెడ్డి, హిందీలో కబీర్ సింగ్ సినిమాలతో సంచలనం సృష్టించిన ఈ దర్శకుడు.. ఇప్పుడు తన మూడో ప్రయత్నంగా బాలీవుడ్ లోనే కొత్త ప్రాజెక్టు ప్రకటించాడు. రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే సినిమా ప్రకటన వచ్చేసింది. ఇదొక గ్యాంగ్ స్టర్ కథ. అర్జున్ రెడ్డి తరహాలోనే హీరో క్యారెక్టర్ బాగా లోతుగా ఉంటుంది. అంతేకాదు, బోల్డ్ ప్రజెంటేషన్ కూడా ఉంటుంది. […]

Advertisement
Update: 2021-01-01 07:00 GMT

నూతన సంవత్సర కానుకగా తన కొత్త సినిమా ప్రకటించాడు సందీప్ రెడ్డి వంగ. తెలుగులో అర్జున్ రెడ్డి, హిందీలో కబీర్ సింగ్ సినిమాలతో సంచలనం సృష్టించిన ఈ దర్శకుడు.. ఇప్పుడు తన మూడో ప్రయత్నంగా బాలీవుడ్ లోనే కొత్త ప్రాజెక్టు ప్రకటించాడు. రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే సినిమా ప్రకటన వచ్చేసింది.

ఇదొక గ్యాంగ్ స్టర్ కథ. అర్జున్ రెడ్డి తరహాలోనే హీరో క్యారెక్టర్ బాగా లోతుగా ఉంటుంది. అంతేకాదు, బోల్డ్ ప్రజెంటేషన్ కూడా ఉంటుంది. ఈ కథను గతంలో మహేష్ బాబుతో డిస్కస్ చేశాడట సందీప్ రెడ్డి. చాన్నాళ్ల పాటు చర్చలు జరిగిన తర్వాత ఈ సినిమా చేయకూడదని మహేష్ నిర్ణయించుకున్నాడట.

ఇప్పుడు ఇదే కథను యాజ్ ఇటీజ్ గా రణబీర్ కపూర్ అంగీకరించినట్టు తెలుస్తోంది. అనీల్ కపూర్, బాబి డియోల్ కీలక పాత్రలు పోషించనున్న ఈ సినిమాలో పరిణీతి చోప్రా హీరోయిన్ గా నటించబోతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ లో సందీప్ రెడ్డి ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. ఇది కూడా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయితే.. మహేష్ బాబు ఓ మంచి ఛాన్స్ ను మిస్ చేసుకున్నట్టే అనుకోవాలి.

Tags:    
Advertisement

Similar News