రాయపాటి మమతను విచారించిన పోలీసులు

స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌ అగ్నిప్రమాదంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. రాయపాటి సాంబశివరావు కోడలు రాయపాటి మమతను పోలీసులు విచారిస్తున్నారు. సీఆర్‌పీసీ 160 కింద ఆమెకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ సూర్యచంద్రరావు మమతను విచారిస్తున్నారు. రమేష్ ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌ లో రాయపాటి మమత కూడా సభ్యురాలిగా ఉన్నారు. ఆస్పత్రికి సంబంధించిన పలు వివరాలను ఆమె నుంచి పోలీసులు సేకరించారు. ప్రస్తుతం రమేష్ ఆస్పత్రి యజమాని రమేష్ చౌదరి పరారీలో ఉన్నారు. అతడిని […]

Advertisement
Update: 2020-08-14 02:28 GMT

స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌ అగ్నిప్రమాదంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. రాయపాటి సాంబశివరావు కోడలు రాయపాటి మమతను పోలీసులు విచారిస్తున్నారు. సీఆర్‌పీసీ 160 కింద ఆమెకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ సూర్యచంద్రరావు మమతను విచారిస్తున్నారు.

రమేష్ ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌ లో రాయపాటి మమత కూడా సభ్యురాలిగా ఉన్నారు. ఆస్పత్రికి సంబంధించిన పలు వివరాలను ఆమె నుంచి పోలీసులు సేకరించారు. ప్రస్తుతం రమేష్ ఆస్పత్రి యజమాని రమేష్ చౌదరి పరారీలో ఉన్నారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News