ఇకపై ముంబయి వెళ్లనంటున్న పూరి

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ చేస్తున్న సినిమా ఫైటర్. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు పూరి జగన్నాధ్. మూవీకి సంబంధించి భారీ షెడ్యూల్ ను ముంబయిలో పూర్తిచేశారు. ఇంకా అది కొంచెం పెండింగ్ ఉంది. దీంతో పాటు ముంబయిలోనే మరో షెడ్యూల్ కూడా జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడా షెడ్యూల్స్ మొత్తాన్ని పూరి కాన్సిల్ చేశాడు. అవును.. తన అప్ కమింగ్ మూవీ ఫైటర్ సినిమాకు […]

Advertisement
Update: 2020-04-24 04:00 GMT

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ చేస్తున్న సినిమా ఫైటర్. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు పూరి జగన్నాధ్. మూవీకి సంబంధించి భారీ షెడ్యూల్ ను ముంబయిలో పూర్తిచేశారు. ఇంకా అది కొంచెం పెండింగ్ ఉంది. దీంతో పాటు ముంబయిలోనే మరో షెడ్యూల్ కూడా జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడా షెడ్యూల్స్ మొత్తాన్ని పూరి కాన్సిల్ చేశాడు.

అవును.. తన అప్ కమింగ్ మూవీ ఫైటర్ సినిమాకు సంబంధించి ఇకపై ముంబయిలో ఎలాంటి షెడ్యూల్స్ నిర్వహించకూడదని పూరి నిర్ణయించాడు. దీనికి కారణం కరోనా. అవును.. ఇండియాలోనే అత్యథికంగా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా ముంబయిలో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో మేకర్స్ అంతా ముంబయిలో షూటింగ్స్ రద్దుచేసుకుంటున్నారు. ఈ క్రమంలో పూరి జగన్నాధ్ కూడా ముంబయి షెడ్యూల్స్ రద్దుచేసుకున్నాడు.

ముంబయిలో తీయాల్సిన సన్నివేశాల్ని హైదరాబాద్ లోనే తీయాలని నిర్ణయించాడు పూరి జగన్నాధ్. ఈ మేరకు స్క్రీన్ ప్లేలో చిన్నచిన్న మార్పులు చేశాడు. ఇక కచ్చితంగా ముంబయిలోనే తీయాల్సిన సన్నివేశాల కోసం రామోజీ ఫిలింసిటీలో ముంబయిని తలపించేలా సెట్ వేయాలని నిర్ణయించాడు. ముంబయిలో మాత్రం ప్రస్తుతానికి షూట్ చేయకూడదనేది పూరి ఆలోచన. ఇదే సరైన నిర్ణయం కూడా.

Tags:    
Advertisement

Similar News